శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: బుధవారం, 26 ఫిబ్రవరి 2020 (11:50 IST)

నాగశౌర్యని కెలికిన నితిన్, మళ్లీ మొదటికి వచ్చిన గొడవ

నితిన్ - రష్మిక జంటగా నటించిన తాజా చిత్రం భీష్మ. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్‌కి ఛలో ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించింది. ఇటీవల రిలీజైన ఈ సినిమా సక్సస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. నాలుగు రోజులకు దాదాపు 16 కోట్లు కలెక్ట్ చేసి నితిన్ కెరీర్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ వసూలు చేసే సినిమాగా నిలవనుంది. ఈ సినిమా సాధించిన విజయాన్ని పురస్కరించుకుని సక్సస్ మీట్ ఏర్పాటు చేసారు.
 
ఈ వేడుకలో నితిన్ మాట్లాడుతూ... టీమ్ అందరికీ థ్యాంక్స్ చెప్పారు. ఈ సినిమా స్పెషల్ మూవీ ఎప్పటికీ గుర్తుంటుంది అన్నారు. అయితే.. దర్శకుడు వెంకీ కుడుముల గురించి చెబుతూ... ఈ కథ నీదే కదా అన్నాడు. అంతా అక్కడ ఉన్న వారందరూ ఠక్కున నవ్వేసారు. ఇంతకీ విషయం ఏంటంటే.. ఛలో సినిమాని వెంకీ కుడుముల తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమా సక్సస్ తర్వాత నాగశౌర్య ఈ సినిమా కథ తనదే అన్నట్టు చెప్పారు.
 
వెంకీ చెప్పిన స్టోరీ లైన్ బాగోకపోతే తనే ఛలో స్టోరీ లైన్ చెప్పి డెవలెప్ చేయించానని అన్నారు. అప్పటి నుంచి నాగశౌర్యకు, వెంకీ కుడుములకు మధ్య మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. నాగశౌర్య తల్లి గిఫ్ట్‌గా ఇచ్చిన కారును సైతం వెంకీ కుడుముల వాడటం లేదు. ఇదే విషయం గురించి నాగశౌర్యని మీడియా అడిగితే జీవితంలో వెంకీతో మాట్లాడను అని చెప్పారు. ఇక వెంకీ కూడా అంతే, నాగశౌర్యతో మాట్లాడడను అన్నారు.
 
ఇలా సీరియస్‌గా వీరిద్దరి మధ్య జరుగుతుంది. అందుకనే ఈ కథ నీదే కదా అని నితిన్ అనగానే... అక్కడ ఉన్న వారందరూ నవ్వేసారు. మరి.. దీని గురించి నాగశౌర్య స్పందిస్తాడేమో చూడాలి.