1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Rashmi Gautham pair up with aadhi

విశాఖలోనే స్థిరపడతా.. ఆది సరసన నటిస్తున్నా.. జబర్దస్త్ రష్మి గౌతమ్

టీవీ యాంకర్ నుంచి సినిమా యాక్టర్ అయిన రష్మీ ప్రస్తుతం హిట్ సినిమాపై కన్నేసింది. ఇప్పటివరకు గుంటూరు టాకీస్‌తో పాటు నాలుగైదు సినిమాల్లో నటించినా అందాలను బాగానే ఆరబోసినా.. హిట్ మాత్రం రాలేదు. అయితే తాజాగ

Rashmi Gautham
టీవీ యాంకర్ నుంచి సినిమా యాక్టర్ అయిన రష్మీ ప్రస్తుతం హిట్ సినిమాపై కన్నేసింది. ఇప్పటివరకు గుంటూరు టాకీస్‌తో పాటు నాలుగైదు సినిమాల్లో నటించినా అందాలను బాగానే ఆరబోసినా.. హిట్ మాత్రం రాలేదు. అయితే తాజాగా ఆది సరసన నటిస్తున్న సినిమా ద్వారా హిట్ కొట్టాలని రష్మీ భావిస్తోంది.

తాజాగా విశాఖపట్నంలోని మద్దిలపాలెంలో కొత్తగా ఏర్పాటు చేసిన హోంఫుడ్స్‌ దుకాణం ప్రారంభోత్సవంలో ‘జ
బర్దస్త్‌’ యాంకర్‌, సినీ నటి రష్మి పాల్గొని సందడి చేసింది. విశాఖకు రష్మీ వచ్చిందనే విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ అక్కడికి భారీ ఎత్తున తరలి వచ్చారు. 
 
ఈ సందర్భంగా రష్మీ మీడియాతో మాట్లాడుతూ.. తాను భవిష్యత్తులో విశాఖలోనే స్థిరపడతానని చెప్పింది. ప్రస్తుతం తాను తెలుగు చిత్రాల్లోనే నటిస్తున్నానని, గీతా ఆర్ట్స్‌, యువీ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఓ చిత్రంలో ఆది సరసన నటిస్తున్నట్లు వెల్లడించింది. ఈ చిత్రంలో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుందని చెప్పుకొచ్చింది. 
About Writer
selvi
తర్వాతి కథనం
అయిదేళ్ల కుమారుడి సమక్షంలో ఇంత షాకింగ్ సెల్ఫీలు దిగాలా మందిరా.. ఖర్మ.. ఇవీ వైరలే..నట