#RipSanam- ఒకే రోజు ఇద్దరు నటుల మృతి.. ఆ రోగాలు మింగేశాయి..
Sidharth Jamwal
సిద్ధార్థ్ జమ్వాల్ శుక్రవారం రాత్రి కరోనా వైరస్తో ప్రాణాలు కోల్పోగా, సనమ్ బ్రెయిన్ క్యాన్సర్తో మృతి చెందింది. సిద్ధార్థ్ కరోనా సోకడంతో కొన్ని రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఇక సనమ్ బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతూ వచ్చింది. కానీ ఇద్దరూ ఒకే రోజున ప్రాణాలు కోల్పోవడంపై సోషల్ మీడియాలో వారి ఫ్యాన్స్ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమానులు కోల్పోయామని బాధను వెల్లగక్కుతున్నారు. ఇంకా సినీ ప్రముఖులు వీరి మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇంత పిన్న వయస్సులోనే ఈ లోకం వదిలి వెళ్లిపోవడంపై ఘోరమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
