1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Suresh productions completed 55 years

55 వసంతాలు పూర్తి చేసుకున్న సురేష్ ప్రొడక్షన్స్..

Suresh
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థలలో మూవీమొగల్ డా.డి. రామానాయుడు స్థాపించిన సురేష్ ప్రొడక్షన్స్ ఒకటి. ఈ సంస్థ ఇప్పటికే 120కు పైగా చిత్రాలను నిర్మించింది. ఈ సంస్థ నుండి మొదటిగా ఇదే రోజున అనగా మే 21వ తేదీన సీనియర్ ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంలో నటించిన 'రాముడు - భీముడు' చిత్రం విడుదలై ఇప్పటికి సరిగ్గా 55 ఏళ్ళు పూర్తయింది. 
 
గడిచిన ఐదున్నర దశాబ్దాల కాలంలో ఈ సంస్థ బ్యానర్‌లో రామానాయుడు గారు అనేక భారతీయ భాషల్లో చిత్రాలను నిర్మించారు. తెలుగులో ఈ సంస్థ నుండి వచ్చిన సినిమాలలో ముఖ్యంగా చెప్పుకోవాలంటే శ్రీకృష్ణ తులాభారం, ప్రేమ్ నగర్, సెక్రెటరీ, దేవత, మాంగల్య బలం, బొబ్బిలి  రాజా, కూలీ నెం 1 లాంటి అనేక హిట్ సినిమాలు ఉన్నాయి. ఎందరో నటీనటులను, దర్శకులను, టెక్నీషియన్‌లను చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన ఘనత ఈ సంస్థకు దక్కడం విశేషం.
About Writer
మోహన్
తర్వాతి కథనం
మంచుకొండల్లో హాట్ యాంకర్... అభిమానుల కామెంట్స్