సంబంధిత వార్తలు
- Washi Yo Washi from OG: పవన్ పాడిన వాషి యో వాషి సాంగ్ రిలీజ్.. ఫ్యాన్స్కు మెగా విందు
- యాడ్ షూటింగ్... జూనియర్ ఎన్టీఆర్కు స్వల్ప గాయం..
- Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు.. దహనం చుట్టూ వివాదం
- డ్రాగన్ కోసం బరువు తగ్గుతున్న ఎన్టీఆర్.. వర్కౌట్ వీడియో వైరల్
- Upendra : సైబర్ మోసంలో చిక్కుకున్న కన్నడ నటుడు ఉపేంద్ర, భార్య ప్రియాంక (video)
Akella: ఆకెళ్ల సూర్యనారాయణ ఇక లేరు
Akella
తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ పట్టణంలో జానకీ, రామయ్య దంపతులకు ఆకెళ్ల సూర్యనారాయణ జన్మించారు. చిన్నతనం నుండే నాటకాలలో నటించడం ప్రారంభించారు. 1960లో బాలరాముడి పాత్రతో నాటకరంగంలోకి అడుగుపెట్టారు. మొదటగా చందమామ, బాలమిత్ర పత్రికలకు కథలు వ్రాసి పంపించడం మొదలుపెట్టారు. డిగ్రీ పూర్తయిన తర్వాత తన మొదటి నవల రచించారు. వీరు సుమారు 200 కథలు, 20 నవలలను రచించారు. వీనిలో కొన్ని ఇతర భారతీయ భాషలలోకి అనువదించబడ్దాయి. టీవీ సీరియల్స్కి దాదాపుగా 800 ఎపిసోడ్స్ రాశారు.
సాంఘిక నాటికలు, పిల్లల నాటికలు, పద్య నాటకాలు, రేడియో నాటకాలు ఇలా అన్ని విభాగాల్లో రచన చేశారు. 1997లో తొలిసారిగా కాకి ఎంగిలి అనే నాటకాన్ని రాశాడు. తరువాత అల్లసాని పెద్దన, రాణి రుద్రమ, రాణాప్రతాప్ లాంటి చారిత్రక నాటకాలు రాశారు.
ఆకెళ్ల రచయితగా పని చేసిన తొలి చిత్రం మగమహారాజు. తర్వాత స్వాతిముత్యం, శ్రుతిలయలు, ఆడదే ఆధారం, సిరివెన్నెల, శ్రీమతి ఒక బహుమతి, నాగదేవత, ఇల్లు ఇల్లాలు పిల్లలు, ఓ భార్య కథ, ఆయనకి ఇద్దరు, చిలకపచ్చ కాపురం, ఔనన్నా కాదన్నా, ఎంత బావుందో చిత్రాలకు రచయితగా పని చేశారు.
అంతేకాకుండా అయ్యయ్యో బ్రహ్మయ్య చిత్రానికి దర్శకత్వం కూడా వహించారు. ఆకెళ్ల సూర్యనారాయణకు ఎన్నో అవార్డులు కూడా లభించాయి. విశాలాంధ్ర అవార్డు, ఆంధ్రప్రభ అవార్డు, యువ చక్రపాణి అవార్డు, విజయ మాస పత్రిక అవార్డు, కాకి ఎంగిలి నాటకానికి సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. అలాగే 13 సార్లు ఉత్తమ రచయితగా నంది అవార్డును అందుకోవడం విశేషం.
ఆకెళ్ల సూర్యనారాయణకు ఐదుగురు సంతానం. నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆకెళ్ల అంత్యక్రియలు శనివారం ఉదయం 10.30లకు హైదరాబాద్లోని హఫీజ్పేటలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఆకెళ్ల మృతి పట్ల ఇండస్ట్రీ నుంచి పలువురు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
