1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
  4. Full rush in tirumala

తిరుమల కిటకిట

rush
తిరుమల కిటకిటలాడుతోంది. వేసవి సెలవుల నేపథ్యంలో సోమవారం కూడా భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం ఉదయం 3 గంటల నుంచి  సాయంత్రం 6 గంటల వరకు 59,793 మంది భక్తులు శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అదే సమయానికి వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండాయి. వీరికి 18 గంటలు, కాలిబాటన వచ్చే భక్తులకు  7 గంటల్లోస్వామివారి దర్శనం జరుగుతోంది. 
 
రద్దీ కారణంగా గదుల కోసం మూడు గంటలు వేచి ఉండాల్సి వచ్చింది. తలనీలాలు సమర్పించుకునేందుకు రెండు గంటలు వేచి ఉన్నారు.తిరుమలలో ఆదివారం సాయంత్రం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది
About Writer
pyr