1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
  4. Vasanthotsavam to begin at Tiruchanoor from today

మే 22 నుంచి 24 వరకు తిరుచానూరు వార్షిక వసంతోత్సవం

Tiruchanoor
Tiruchanoor
తిరుచానూరు వార్షిక వసంతోత్సవానికి అంకురార్పణం మంగళవారం సాయంత్రం వైభవంగా జరిగింది. పుణ్యహవచనం, రక్షాబంధనం, అంకురార్పణం, సేనాపతి ఉత్సవం పాంచరాత్ర ఆగమ విధి ప్రకారం అర్చకులు నిర్వహించారు. డీఈవో గోవిందరాజన్, అర్చక బాబు స్వామి తదితరులు పాల్గొన్నారు. మే 22 నుంచి 24 వరకు ఫ్రైడే గార్డెన్స్‌లో వసంతోత్సవం జరగనుంది.
 
అలాగే విశాఖ నగరంలోని మధురానగర్‌లో శ్రీ లక్ష్మీగణపతి సహిత శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయ 30వ వార్షికోత్సవం ఈ నెల 23 నుంచి జరుగుతోంది. మధుసూదన్ నగర్ సేవాసంఘం అధ్యక్షుడు కె.అప్పారావు, ఆలయ చైర్మన్ ఎస్.శంకరరావు ఉత్సవం విశేషాలను తెలియజేస్తూ.. మే 26 వరకు నాలుగు రోజుల పాటు వార్షిక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 
 
గురువారం ఉదయం 7.30 గంటల నుండి, ఈ సందర్భంగా అనేక కార్యక్రమాలు వరుసగా జరుగుతాయి. ఉత్సవంలో జలాభిషేకం, పాలాభిషేకం, కుంకుమ పూజ, ఇతర కార్యక్రమాలు జరుగుతాయి.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
కూర్మ జయంతి... సేమియాతో స్వీట్లు, పండ్లు.. విష్ణు సహస్రనామాన్ని..?