శుక్రవారం, 18 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 11 ఫిబ్రవరి 2024 (15:27 IST)

తిరుపతి లోక్‌సభ బై పోల్‌లో దొంగ ఓట్ల దందా... పోలీసులపై ఈసీ కొరఢా!

election commission
గతంలో తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో దొంగ ఓట్ల వ్యవహారంలో భారత ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఇప్పటికే లోక్‍‌సభ ఉప ఎన్నికల సమయంలో పనిచేసిన కలెక్టరుపై చర్య తీసుకుంది. అలాగే, ఇపుడు పలువురు పోలీసు అధికారులపై ఈసీ కొరఢా ఝుళిపించింది. అప్పటి తిరుపతి నగర తూర్పు, పశ్చిమ సీఐలు శివప్రసాద్ రెడ్డి, శివప్రసాద్‌లపై వేటువేసింది. తూర్పు పీఎస్ ఎస్ఐ జయస్వాములు, హెడ్ కానిస్టేబుల్ ద్వారకానాథ్ రెడ్డిని కూడా సస్పెండ్ చేసింది. అలిపిరి అప్పటి సీఐ దేవేంద్ర కుమార్‌ను వీఆర్‌కు బదిలీ చేసింది. ఉప ఎన్నికల వేళ దొంగ ఓట్ల కేసును నీరుగార్చారని వీరిపై ఆరోపణలు ఉన్నాయి. సాక్ష్యాధారాలు లేవని పేర్కొంటూ వీరు కేసులను మూసివేశారు. 
 
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక సందర్భంగా అధికార వైకాపా 34 వేల దొంగ ఓట్ల ఎపిక్ కార్డులను ముద్రించి ఓట్లు వేయించుకున్నట్టు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై ప్రతిపక్షాలు, ఎన్నికల అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు 13 కేసులు నమోదు చేశారు. ఎపిక్ కార్డుల ఆధారాలు ఉన్నప్పటికీ సమగ్ర విచారణ చేపట్టకుండా కేసును మూసి వేసిన పోలీసులపై ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. ఈసీ ఆదేశాల మేరకు అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డి సస్పెన్ష్ ఉత్తర్వులు జారీచేశారు.