మాజీ మంత్రి కాకాణికి బెయిల్.. మరో రెండు కేసుల్లో రిమాండ్ - కస్టడీ
వైకాపా సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై నమోదైవున్న కేసుల్లో ఓ కేసులో మాత్రం బెయిల్ లభించింది. మరో రెండు కేసుల్లో మాత్రం రిమాండ్, కస్టడీని ఎదుర్కొంటున్నారు. అలాగే ఓ కేసులో ఆయనను రెండు రోజుల పాటుు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ మేజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీచేశారు.
సర్వేపల్లి రిజర్వాయరులో గ్రానైట్ అక్రమ తవ్వకాలకు సంబంధించిన కేసులో రెండో అదనపు మేజిస్ట్రేట్ శారదా రెడ్డి శుక్రవారం కాకాణి గోవర్ధన్ రెడ్డికి బెయిల్ మంజూరు చేశారు. అయితే, కనుపూరు చెరువులో మట్టి తవ్వి లే ఔట్లకు విక్రయించిన కేసులో మాత్రం నెల్లూరు అదనపు మేజిస్ట్రేట్ నిషాద్ షేక్ మాత్రం కాకాణికి 14 రోజుల రిమాండ్ విధించారు. ప్ర్రస్తుతం కాకాణి నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెల్సిందే.
ఇదిలావుంటే, 2022లో కృష్ణపట్నం పోర్టు సమీపంలో అనధికార టోల్గేట్ ఏర్పాటు చేసిన కేసులో రెండు రోజుల పోలీస్ కస్టడీకి న్యాయమూర్తి అనుమతించారు. సోమవారం ఉదయం 8 గంటల నుంచి జూలై ఒకటో తేదీ సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరిపి, తిరిగి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలని న్యాయస్థానం ఆదేశించింది.