శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 20 నవంబరు 2019 (11:11 IST)

కిరాణా షాపుకు వచ్చే పసిమొగ్గపై అత్యాచారం.. గట్టిగా అరవడంతో..?

దేశంలో మహిళలపై అకృత్యాలు పెరిగిపోతున్నాయి. కఠినమైన శిక్షలు లేకపోవడంతో కామాంధులు వయోబేధం లేకుండా విరుచుకుపడుతున్నారు. చిన్నారులపై, బాలికలపై మానవమృగాలు అత్యాచారానికి పాల్పడుతున్నాయి. తాజాగా హైదరాబాద్ శివార్లలో ఐదేళ్ల చిన్నారిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. కిరాణా షాపు వచ్చి వెళ్లే ఐదేళ్ల చిన్నారిపై ఆ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
వివరాల్లోకి వెళితే, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం పోరండ్ల గ్రామంలో 19 ఏళ్ల యువకుడు ఓ కిరాణా షాపు నిర్వహిస్తున్నాడు. అయితే ఆ షాపునకు నిత్యం వచ్చే ఐదేళ్ల చిన్నారిపై అతని కన్ను పడింది. చిన్నారి తల్లిదండ్రులు కూలీ పనులకు వెళ్తుంటారు. చిన్నారికి ఓ అక్క ఉంది. ఆమె ఆ సమయలో ఇంటి బయట ఆడుకుంటుంది. దీంతో అదును చూసి ఆ పసిమొగ్గపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
పాప గట్టిగా ఏడవడటంతో అక్కడ్నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు... ఈ కీచకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు అతడిపై ఐపీసీ సెక్షన్ 370 ప్రకారం రేప్ కేసు, పోస్కో చట్టం కింద కేసులు నమోదు చేశారు.