1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. AP markfed gets fund for Totapuri Mango Support Price

తోతాపురి మామిడి రైతులకు ఏపీ సర్కారు శుభవార్త.. అదేంటంటే?

Totapuri Mango
Totapuri Mango
తోతాపురి మామిడి పంట దిగుబడి భారీగా పెరగడంతో మార్కెట్లో ధరలు పడిపోయాయి. గత ఏడాదితో పోలిస్తే మూడు రెట్లు అధికంగా దిగుబడి రావడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందారు. దీంతో మామిడి రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర సర్కారు ముందుకు వచ్చింది.
 
అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల తోతాపురి మామిడి రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ధరల వ్యత్యాస పథకం కింద ప్రతి కిలో మామిడికి నాలుగు రూపాయల చొప్పున అదనపు సాయం అందించాలని నిర్ణయించింది. 
 
ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా తోతాపురి మామిడి రైతులకు మేలు చేసేలా మొత్తం రెండు వందల ఎనిమిది ఒకటి కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిధులను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేయడంతో రైతుల ఖాతాల్లో త్వరలోనే డబ్బులు జమ కానున్నాయి. 
 
ఇందులో భాగంగా అధికారుల బృందాలు మామిడి మండీలు పరిశ్రమల్లో పర్యటించి రైతులకు మేలు జరిగేలా పర్యవేక్షణ చేశాయి. సీజన్ చివరి దశలో మంచి ధరలు పలకడంతో పాటు ప్రభుత్వం నుంచి అదనపు సాయం అందుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
TGSRTC, ఆటోను తప్పించబోయి పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన బస్సు, వీడియో