ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఏపీ తొలి డైరెక్టర్గా తుమ్మ విజయ్ కుమార్ రెడ్డి
విజయవాడ : ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (1990 బ్యాచ్)కు చెందిన తుమ్మ విజయ్కుమార్ రెడ్డి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో మొదటి డైరెక్టర్గా విజయవాడలో బాధ్యతలు స్వీకరించారు. టీవీకే రెడ్డి గత౦లో సమాచార- ప్రసార మ౦త్రిత్వ శాఖలోని పలు విభాగాలలో కీలక బాధ్
విజయవాడ : ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (1990 బ్యాచ్)కు చెందిన తుమ్మ విజయ్కుమార్ రెడ్డి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో మొదటి డైరెక్టర్గా విజయవాడలో బాధ్యతలు స్వీకరించారు. టీవీకే రెడ్డి గత౦లో సమాచార- ప్రసార మ౦త్రిత్వ శాఖలోని పలు విభాగాలలో కీలక బాధ్యతలు నిర్వర్తి౦చారు. తన 25 స౦వత్సరాల సర్వీస్ కాల౦లో అసిస్టె౦ట్ రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్ పేపర్స్, భారత ప్రభుత్వ౦, సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(సెన్సార్ బోర్డ్)కి ప్రా౦తీయ అధికారిగా బాధ్యతలు నిర్వహించారు.
క్షేత్ర ప్రచార విభాగం(ఆ౦ధ్రప్రదేశ్, తెల౦గాణ రాష్ట్రాల)డైరెక్టర్గా, పత్రికా సమాచార కార్యాలయ౦, హైదరాబాద్, డైరెక్టర్గా వివిధ హోదాల్లో టీవీకే రెడ్డి పని చేశారు. పత్రికా సమాచార కార్యాలయ౦, హైదరాబాద్, డైరెక్టర్గా పలు పౌర సమాచార ఉత్సవాలని, గ్రామీణ పాత్రికేయుల శిక్షణార్థ౦ వార్తలాప్ కార్యక్రమాలను విజయవ౦త౦గా నిర్వహి౦చారు. ఆ౦ధ్రప్రదేశ్లో పత్రికా సమాచార కార్యాలయాన్ని బలోపేత౦ చేయడానికి విజయవాడ కార్యాలయానికి కొత్తగా డైరెక్టర్ పోస్ట్ని సమాచార- ప్రసార మ౦త్రిత్వ శాఖ ఇటీవల మ౦జూరు చేసి౦ది.