1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Jagan Warns YCP Leaders

స్థానిక సంస్థల ఎన్నికలు.. వైసీపీ అగ్రనేతలకు జగన్ వార్నింగ్

Jagan
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి వైసీపీ అగ్రనేతలకు గట్టి హెచ్చరిక జారీ చేశారు. రాష్ట్రంలోని ప్రతి కార్పొరేషన్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానానికి వైసీపీ అభ్యర్థులు కచ్చితంగా పోటీ చేయాలని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎటువంటి మినహాయింపు ఉండదని ఆయన తేల్చి చెప్పారు. 
 
ఏదైనా జిల్లా లేదా అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి నాయకుడు స్థానిక కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిని పోటీ చేయించడంలో విఫలమైతే, వారికి తదుపరి ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వబడదన్నారు. అభ్యర్థిని నిలబెట్టడంలో ఎవరైనా అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి నాయకుడు విఫలమైతే, వారు తన ఆగ్రహానికి గురవుతారని జగన్ మండిపడ్డారు. 
 
రాష్ట్రంలో పార్టీ పట్టు కోల్పోకుండా చూసుకోవాలనే ఉద్దేశంతో జగన్ సాధ్యమైనన్ని నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులను బరిలోకి దించాలని భావిస్తున్నారు. కానీ, గత రెండేళ్లుగా బహిరంగ వేదికలపైన గానీ, పార్టీ కార్యకలాపాల నిర్వహణలో గానీ జగన్ స్వయంగా పెద్దగా కనిపించలేదు. 
 
అటువంటి పరిస్థితుల్లో, అకస్మాత్తుగా బయటకు వచ్చి... తదుపరి ఎన్నికల్లో ఎమ్మెల్యే లేదా ఎంపీ టికెట్లు ఇవ్వబోమని వైసీపీ నాయకులను హెచ్చరించడం సరైన వ్యూహం కాకపోవచ్చని, ఏపీ రాజకీయాలను నిశితంగా పరిశీలించాలని రాజకీయ పండితులు అంటున్నారు. 
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
ఇస్లామాబాద్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం - 15 మంది నవజాత శిశువుల సజీవదహనం