గురువారం, 4 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 11 సెప్టెంబరు 2023 (09:50 IST)

నందివాడ మహిళా ఎస్ఐ భర్త అనుమానాస్పద మృతి!

nandivada si couple
కృష్ణా జిల్లా నందివాడ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ పామర్తి శిరీష భర్త బి.అశోక్ (30) ఆదివారం సాయంత్రం అనుమానాస్పదంగా మృతి చెందారు. అశోక్ ఇంట్లో ఉరేసుకోగా గుర్తించిన భార్య శిరీష, ఆమె తరపు బంధువులు వెంటనే గుడివాడ ఏలూరు రోడ్డులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అయితే, ఆయన ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సివుంది. 
 
ఏలూరుకు చెందిన శిరీష గుంటూరు జిల్లా పెదకాకానికి చెందిన బి.అశోక్ రెండేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారిది కులాంతర వివాహం. ఏడాది వయసు గల ఒక కుమార్తె ఉంది. శిరీష మచిలీపట్నంలోని స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐగా పని చేస్తూ నాలుగు నెలల క్రితమే నందివాడకు బదిలీపై వచ్చి అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో ఆమె భర్త అనుమానాస్పదంగా చనిపోవడం ఇపుడు కలకలం రేపింది. మరోవైపు, అధికార పార్టీ పెద్దలు, పోలీసు ఉన్నతాధికారులు మృతుని కుటుంబ సభ్యులతో రాజీ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది.