1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 16 మార్చి 2020 (08:34 IST)

న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం: ఎన్నికల కమిషన్ చర్యలపై ఎమ్మెల్యే ఆనం

ఎన్నికల వాయిదా పడటంపై స్థానిక ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా వైరస్ పేరుతో చంద్రబాబు స్థానిక ఎన్నికలు జరుగనీయకుండా అడ్డుకోవడం దురదృష్టకరమని ఆయన విమర్శించారు.

చంద్రబాబు మూలంగా రాష్ట్రానికి ఆర్దికంగా వేలాది కోట్ల నష్టం జరిగిందని విమర్శించారు. ప్రజాక్షేత్రంలో ఎదుర్కొనే దమ్ము టిడిపికి లేదు కనుకే ఇలా ఎన్నికలను అడ్డుకున్నారని ఆయన అన్నారు. అలాగే బాబు కుట్రలకు వత్తాసు పలికిన ఎన్నికల కమిషన్ చర్యలపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఆయన అన్నారు.

ఏ క్షణం ఎన్నికలు నిర్వహించినా ఎదుర్కొనేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు.