సంబంధిత వార్తలు
- Peddi Collections: పెద్ది మొదటి వారానికి ఓజీ, మహావతార్ నరసింహ కంటే వెనుకబడిందా ?
- హైదరాబాద్కు రావొద్దంటే.. రాహుల్కు దక్షిణాదిలో ఏంపని? పవన్ కళ్యాణ్ ప్రశ్న
- ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న నిరంతర యంత్రం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, రాష్ట్రానికి భారీ నిధులు
- పల్లె ప్రజల జీవనం - ప్రేమానుబంధాలు చూపించడంలో దిట్ట : పవన్ కళ్యాణ్
- Pawankalyan: భారతీరాజా గారి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్, కె రాఘవేంద్రరావు
పవన్ కళ్యాణ్ ఒక పర్ఫెక్ట్ మ్యాన్.. తెలంగాణకు వస్తే మంచే జరుగుతుంది.. మాధవీలత
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తూ టాలీవుడ్ నటుడు రాహుల్ రామకృష్ణ చేసిన వరుస ట్వీట్లపై నటి, బీజేపీ నేత మాధవీలత స్పందించారు. రాహుల్ రామకృష్ణ వైఖరిని తప్పుపడుతూ ఆమె అత్యంత ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. రాహుల్ రామకృష్ణ కేవలం పవన్ కళ్యాణ్ను ప్రశ్నించినంత మాత్రాన దేశద్రోహి అవ్వరని.. కానీ ఆయన ధోరణి చూస్తుంటే భయం వేస్తోందని మాధవీలత వ్యాఖ్యానించారు.
తెలంగాణలో ఆంధ్రావాళ్లు ఉండకూడదు, మార్వాడీలు ఉండకూడదు, అందరూ వెళ్లిపోవాలి.. మీరు ఒక్కరే మిగలాలా? తెలంగాణ అనేది భారతదేశంలో ఒక భాగమనే విషయం మర్చిపోవద్దు అంటూ ఆమె మండిపడ్డారు.
Madhavi Latha Backs Pawan Kalyan, Questions Rahul Ramakrishna
— TeluguBulletin.com (@TeluguBulletin) June 11, 2026
స్వార్ధం లేని మనిషి- పవన్ కళ్యాణ్
ఆయన నియోజక వర్గ ప్రజలకు తెలుసు ఆయన ఏమి పనులు చేస్తున్నారో..
అధికారులు అందరూ సక్కగ ఉన్నారా, ప్రజలు అందరూ సక్కగా ఉన్నారా? నిజంగా పొలిటీషియన్స్ మాత్రమే సక్కగా ఉండాలని కోరుకుంటే ఎలా?… pic.twitter.com/wirIgUHSWr
పవన్ కళ్యాణ్ నిస్వార్థమైన నాయకుడని, ఆయన ఎలాంటి భూకబ్జాలు చేయరని, ఎవరి సొమ్ము తినరని మాధవీలత స్పష్టం చేశారు. రాజకీయాల్లో చట్టాలు, రాజ్యాంగ పరిధులు, అధికారులు సహకరించినంత మేర పవన్ కళ్యాణ్ అద్భుతంగా పనిచేయగలరు.
ఆయన నియోజకవర్గ ప్రజలకు, ఏపీ ప్రజలకు ఆయన ఏం చేస్తున్నారో బాగా తెలుసు. పవన్ కళ్యాణ్ ఒక పర్ఫెక్ట్ మ్యాన్. ఆయన ఆంధ్రప్రదేశ్కు దొరికిన ఒక ఆణిముత్యం. ఒకవేళ ఆయన తెలంగాణలో రాజకీయం చేయాలనుకుంటే.. ఇక్కడి ప్రజలకు కూడా ఒక మంచి నాయకుడు దొరికినట్లేనని కొనియాడారు.
అందరికీ పవన్ కళ్యాణ్ మాత్రమే ఉద్దెరగా దొరికారని, వేరే ఏ నాయకుడినీ ప్రశ్నించే దమ్ము ఎవరికీ లేదని మాధవీలత ఎద్దేవా చేశారు. పవన్ను అడిగే ప్రశ్నలేవో సొంత రాష్ట్రంలో ఉన్న మంత్రులను అడిగితే బాగుంటుందని రాహుల్ రామకృష్ణకు గట్టిగా హితవు పలికారు.
గతంలో ఆజాద్ కాశ్మీర్ పేరుతో కొందరు భారత్ నుంచి కాశ్మీర్ను వేరు చేయాలని చూశారు. ఇప్పుడు రాహుల్ రామకృష్ణ కూడా తెలంగాణ పేరుతో అదే సిద్ధాంతాన్ని నమ్ముతున్నట్లు కనిపిస్తోందని మాధవీ లత అన్నారు.
