1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. PV Sindhu Visits Tirumala, Offers Prayers

PV Sindhu: తిరుమల సుప్రభాత సేవలో పీవీ సింధు (video)

PV Sindhu
PV Sindhu
భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి. సింధు శనివారం తిరుమలను సందర్శించి, కొండపై కొలువైన శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రార్థనలు చేశారు. ఆమె శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు ఆమెకు వేదాశీర్వచనం అందించారు. 
 
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు ఆమెకు గౌరవసూచకంగా శ్రీవారి తీర్థ ప్రసాదాలను, శ్రీ వేంకటేశ్వర స్వామి పవిత్ర చిత్రపటాన్ని అందజేశారు. సింధు పర్యటన సందర్భంగా ఆమెను చూసేందుకు భక్తులు ఆసక్తి చూపారు. పలువురు అభిమానులు సింధుతో ఫొటోలు దిగేందుకు ప్రయత్నించారు.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
మహిళా ఎస్‌ఐపై దుశ్శాసన పర్వం... 21 మంది వైకాపా నేతలపై కేసు