1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. RTC bus plunges into Krishna River -37 Passengers safe

కృష్ణా నదిలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. ప్రయాణీకులకు ఏమైంది? (video)

RTC Bus
RTC Bus
ఏపీలో ఆర్టీసీ బస్సు కృష్ణా నదిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ప్రయాణీకులు సురక్షితంగా బయటపడ్డారు. బస్సులో ఉన్న 37 మంది ప్రయాణికులను కాపాడటం జరిగింది. వివరాల్లోకి వెళితే.. విజయవాడ, అవనిగడ్డ కరకట్టపైనుంచి అదుపు తప్పి ఓ ఆర్టీసీ బస్సు కృష్ణా నదిలోకి దూసుకెళ్లింది. 
 
సూపర్ లగ్జరీ బస్సు 37 మంది ప్రయాణీకులతో అవనిగడ్డ నుంచి విజయవాడ వెళుతుండగా ఐలూరు - ఐనపూరు మధ్య ఈ ఘటన జరిగింది. బస్పు పదిహేను అడుగుల మేర దిగువకు దుసుకెళ్లింది. నీటి స్థాయి తక్కువగా ఉండడంతో.. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. 
 
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక విచారణలో రోడ్డు గతుకులమయంగా ఉండడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
బీఆర్ఎస్ బాగా రిచ్ గురూ.. ఆ పార్టీ ఖాతాలో రూ.1500 కోట్లు.. వామ్మో! (video)