శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By
Last Updated : గురువారం, 31 జనవరి 2019 (13:22 IST)

అతి మూత్ర వ్యాధి తగ్గాలంటే...?

చాలామంది అతి మూత్ర వ్యాధితో బాధపడుతుంటారు. ఆసుపత్రుల చుట్టూ తిరిగి తిరిగి అక్కడ ఇచ్చే మందులు, మాత్రలు వాడుతుంటారు. మొదట్లో మందులు తగ్గినట్లు కనిపించినా ఆ తరువాత యథాప్రకారం మూత్రం వస్తూనే ఉంటుంది. ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే.. ఈ చిట్కాలు పాటించండి.. చాలు తక్షణమే ఉపశమనం లభిస్తుంది.
 
1. అతి మూత్ర వ్యాధి తగ్గాలంటే నేరేడు గింజల చూర్ణం 40 రోజులు తినాలి. అలానే అత్తి చెక్క కషాయం తాగుతూ ఉండాలి. వెల్లుల్లిని పూటకు ఎక్కువ చార్లు 10 రోజులు సేవించిన ఈ వ్యాధి తగ్గుతుందట.
 
2. ఉప్పిడి బియ్యం తవుడును, తాటి బెల్లంతో కలిపి మూడురోజుల పాటు తాగాలి. అత్తిపత్తి ఆకు, బెల్లం, సమపాళ్లలో కలిపి నూరి చిన్న ఉసిరి కాయంత తీసుకోవాలి. కసివింద చెట్టు ఎండు గింజలను పొడిచేసి తేనెతో కలిపి మూడు రోజులు భుజించాలి.
 
3. మర్రిచెక్క కషాయంను కూడా తాగాలి. పటిక బెల్లం 3 తులాలు, మిరియాలు 3 తులాలు, శొంఠి 4 తులాలు గ్రహించి చూర్ణం చేయాలి. ఈ చూర్ణాన్ని పూటకు నాలుగవ వంతు చొప్పున నేతిలో కలుపుకుని రోజూ రెండు పూటలా తింటే అతి మూత్ర వ్యాధి తగ్గుతుంది.
 
4. కసివిందాకు 50 గ్రా, కసివింద గింజల చూర్ణం 50 గ్రా, ఉసిరిక చూర్ణం 25 గ్రా, రోజుకు 2 గ్రా చొప్పున మంచి నీటితో కలిపి 5 రోజుల పాటు రోజుకు రెండుపూటలా సేవించాలి. ముదిరిన తుమ్మచెట్టు పట్టను, చితక్కొట్టి నీటిలో కషాయంగా కాచి పూటకు ఒకటి నుంచి 2 స్పూన్ల చొప్పున రెండుపూటలా తాగాలి. ఈ మందు మూత్రంలో చక్కెరను కూడా తగ్గించును.