సంబంధిత వార్తలు
- దేశాభివృద్ధి కోసం రాజకీయ భవిష్యత్ను త్యాగం చేస్తా : నరేంద్ర మోడీ
- 'చిల్లార్'ను చిల్లరగా పోల్చుతూ శశిథరూర్ చిల్లర ట్వీట్
- పెద్ద నోట్ల రద్దు తుగ్లక్ చర్య .. బాంబు పేల్చిన యశ్వంత్ సిన్హా
- దిగివచ్చిన అరుణ్ జైట్లీ.. 177 వస్తువులపై పన్ను భారం తగ్గింపు
- పెద్దనోట్ల రద్దుతో ఒరిగిందేమిటి? విదేశాల్లో మూలుగుతున్న 90శాతం నల్లధనం.. (వీడియో)
రూ.2 వేల నోటును రద్దు చేయం : విత్తమంత్రి జైట్లీ
దేశంలో మరోమారు పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారు రద్దు చేయబోతున్నట్టు ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా, రూ.1000 నోటు స్థానంలో భారత రిజర్వు బ్యాంకు రూ.2000 నోటును ప
దేశంలో మరోమారు పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారు రద్దు చేయబోతున్నట్టు ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా, రూ.1000 నోటు స్థానంలో భారత రిజర్వు బ్యాంకు రూ.2000 నోటును ప్రవేశపెట్టింది.
ప్రస్తుతం ఈ నోటు ముద్రణను ఆర్బీఐ పూర్తిగా నిలిపివేసిందనీ, అందువల్ల ఈ నోటును రద్దు చేయవచ్చని ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన భారతీయ స్టేట్ బ్యాంక్ ఓ నివేదికలో పేర్కొంది. దీంతో రూ.2 వేల నోటు రద్దు ఖాయమనే ప్రచారం జోరుగా సాగింది. ఈ ప్రచారంతో దేశ వ్యాప్తంగా మరోమారు అలజడి చెలరేగింది.
దీంతో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. ఈ వార్తలన్నీ అవాస్తవాలని ఆయన చెప్పారు. ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటనలు వెలువడితే తప్ప ఇలాంటి విషయాలను నమ్మరాదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఏ ఒక్కరూ నమ్మరాదనీ ఆయన కోరారు.
తర్వాతి కథనం
