శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 30 నవంబరు 2017 (16:46 IST)

దేశాభివృద్ధి కోసం రాజకీయ భవిష్యత్‌ను త్యాగం చేస్తా : నరేంద్ర మోడీ

దేశాన్ని అభివృద్ధి చేసే విషయంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా వెనకడుగు వేసే ప్రసక్తే లేదనీ, ఇందుకోసం అవసరమైతే తన రాజకీయ భవిష్యత్‌ను సైతం ఫణంగా పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పునరుద్ఘా

దేశాన్ని అభివృద్ధి చేసే విషయంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా వెనకడుగు వేసే ప్రసక్తే లేదనీ, ఇందుకోసం అవసరమైతే తన రాజకీయ భవిష్యత్‌ను సైతం ఫణంగా పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పునరుద్ఘాటించారు. అవినీతి రహిత పౌర సేవకు తాము కట్టుబడి ఉన్నట్లు ఆయన తెలిపారు. 
 
ఢిల్లీలో నిర్వహించిన హిందుస్తాన్ టైమ్స్ లీడర్‌షిప్ సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ… అభివృద్ధే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అవినీతి రహిత పౌర సేవకు తాము కట్టుబడి ఉన్నట్లు మోడీ స్పష్టంచేశారు. 
 
తమ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాస వల్ల తనకు ఎటువంటి పరిణామం ఎదుర్కోవాల్సి వచ్చినా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. ఇందుకోసం అవసరమైతే రాజకీయంగా భవిష్యత్తును త్యాగం చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. 
 
నోట్ల రద్దుకు ముందు నల్ల ధనం ఓ సమాంతర ఆర్థిక వ్యవస్థగా కొనసాగిందని, కానీ ఇప్పుడు నోట్ల రద్దు తర్వాత నల్ల ధనం దేశ ఆర్థిక వ్యవస్థలో కలిసిపోయిందన్నారు. నోట్ల రద్దు తర్వాత సేకరించిన డేటా ఆధారంగా అవినీతికి పాల్పడిన వారి వివరాలు బయటకు వస్తున్నట్లు ప్రధాని తెలిపారు.