సంబంధిత వార్తలు
జెఈఈ మెయిన్ 2026లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆకాష్ ఇనిస్టిట్యూట్ తెలంగాణ
ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్(ఏఈఎస్ఎల్) నుండి తెలంగాణకు చెందిన నలుగురు విద్యార్థులు జెఈఈ మెయిన్ 2026 (సెషన్ 1)లో అద్భుతమైన ఫలితాలను సాధించారు. ఈ ప్రాంతంలో ఏఈఎస్ఎల్ విద్యా కార్యక్రమం యొక్క నిరంతర విజయానికి సాక్ష్యంగా నిలిచారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్ టి ఏ ) ఫిబ్రవరి 16న విడుదల చేసిన ఫలితాల ప్రకారం, ఆకాష్ ఇన్స్టిట్యూట్కు చెందిన తెలంగాణలోని వివిధ శాఖల విద్యార్థులు జెఈఈ మెయిన్ 2026లో అద్భుతమైన ఫలితాలను సాధించారు.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టిఏ) ఫిబ్రవరి 16న విడుదల చేసిన ఫలితాల ప్రకారం, తెలంగాణలోని ఆకాష్ కేంద్రాల నుండి విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధించారు. ఇద్దరు విద్యార్థులు 99.99 శాతం కంటే ఎక్కువ స్కోర్ చేయగా, ఆరుగురు విద్యార్థులు 99.9 శాతం కంటే ఎక్కువ స్కోర్ చేశారు. ఇక 99.5 శాతం కంటే ఎక్కువ స్కోర్ చేసిన 24 మంది విద్యార్థులు కాగా, మొత్తం 43 మంది విద్యార్థులు 99 శాతం కంటే ఎక్కువ స్కోర్ చేశారు, ఇది రాష్ట్రవ్యాప్తంగా అసాధారణమైన ప్రదర్శనను ప్రతిబింబిస్తుంది.
ఈ విద్యార్థులలో జయంత్ శేఖర్ 99.996 శాతంతో టాపర్గా నిలిచాడు, వీరిలో హంజాల అబేదీన్(99.992 శాతం), అలమూరి చైతన్య(99.97 శాతం), హరీష్ ఆదిత్య ఎంజి(99.92 శాతం), బి అభిజీత్ రెడ్డి(99.91 శాతం) మరియు లోకేష్ వుడుముల(99.91 శాతం) ఉన్నారు. మొత్తంమీద, ఆరుగురు విద్యార్థులు 99.9 శాతం కంటే ఎక్కువ స్కోర్ సాధించారు, వీరు ఆకాష్లో అందించిన బలమైన విద్యా పునాది, కఠినమైన శిక్షణను ప్రతిబింబిస్తారు.
విద్యార్థుల విజయాల గురించి ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ చీఫ్ అకాడమిక్ మరియు బిజినెస్ హెడ్ శ్రీ ధీరజ్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ, తెలంగాణ నుండి మా విద్యార్థులు సాధించిన అసాధారణ ఫలితాలు వారి విద్యా నిబద్ధతకు, అలాగే ఆకాష్ విద్యా పర్యావరణ వ్యవస్థ యొక్క బలానికి నిదర్శనం. వారి కృషికి మేము చాలా గర్వపడుతున్నాము, వారి విజయాలకు అభినందిస్తున్నాము. వారి భవిష్యత్ ప్రయత్నాలలో మరింత విజయం సాధించాలని కోరుకుంటున్నాము.
స్వీయ-క్రమశిక్షణ, స్థిరమైన అభ్యాసం, కఠినమైన శిక్షణ, సకాలంలో మార్గదర్శకత్వం, క్రమంతప్పకుండా ఎస్సెస్మెంట్స్ వంటివి విజయం సాధించడంలో సహాయపడ్డాయని ఈ విద్యార్థులలో చాలామంది విద్యార్థులు తెలిపారు. నిర్మాణాత్మక పాఠ్యాంశాల ద్వారా, అర్హత కలిగిన లెక్చరర్ల మార్గదర్శకత్వం మరియు సిమ్యులేట్ పరీక్ష రాయడానికి క్రమం తప్పకుండా అవకాశం అందించటం ద్వారా వారు తమ చదువులపై దృష్టి సారించామని, బలహీనతలను త్వరగా గుర్తించి తమ పనితీరును క్రమంగా పెంచుకున్నట్లు వారు వెల్లడించారు.
జెఈఈ మెయిన్, పరీక్ష రాయడానికి సంవత్సరంలో రెండు అవకాశాలను కలిగి ఉంటుంది, ఇది విద్యార్థులు వారి మునుపటి ఫలితాలను మెరుగుపరుచుకోవడానికి అనుమతిస్తుంది మరియు ఎన్ఐటి లు, ఐఐఐటి లు మరియు ప్రభుత్వ మద్దతు ఉన్న ఇతర సంస్థలలో విద్యార్థులు ప్రవేశం పొందేందుకు మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి లు) ప్రవేశ పరీక్ష అయిన జెఈఈ అడ్వాన్స్డ్ రాయడానికి అర్హత సాధించడానికి ఒక మార్గం.
