శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 1 మార్చి 2023 (07:46 IST)

ముంబై వాంఖడే స్టేడియంలో సచిన్ విగ్రహం.. బర్త్ డే గిఫ్ట్

sachin tendulkar
ప్రముఖ భారత క్రికెటర్ సచిన్ టెండూల్కర్ భారత క్రికెట్ ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాడు. అతని 50వ పుట్టినరోజు, ఏప్రిల్ 24, 2023న రాబోతోంది. 
 
ఇందులో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో అతని ప్రత్యేక విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ విగ్రహం ఏర్పాటుతో అత్యుత్తమ భారత క్రికెటర్లలో ఒకరిగా పరిగణించబడుతున్న సచిన్‌కు ఇది గొప్ప గౌరవం.
 
సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్‌లో 35000 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. అనేక విజయాలకు అవార్డులను గెలుచుకున్నాడు. ఈ విగ్రహాన్ని సచిన్ పుట్టినరోజున లేదా ఈ ఏడాది చివర్లో జరిగే ప్రపంచకప్ సందర్భంగా ఆవిష్కరించనున్నారు. 
 
ఈ వార్త పట్ల సచిన్ టెండూల్కర్ చాలా హర్షం వ్యక్తం చేశాడు. సచిన్ తన క్రికెట్ కెరీర్ ప్రారంభించిన వాంఖడే స్టేడియంలో ఎన్నో మధురమైన జ్ఞాపకాలను కలిగి ఉన్నాడు.