చిత్రకూట్: యువతిపై ఏడుగురు కీచకులు సామూహిక అత్యాచారం, నిందితులపై ఎగబడ్డ జనం
చిత్రకూట్ నీట్ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడైన జితేంద్ర అలియాస్ భోలాను ఎన్కౌంటర్లో అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్లోని సత్నాకు చెందిన 20 ఏళ్ల నీట్ విద్యార్థినిపై జూలై 22న చిత్రకూట్లోని దేవంగన లోయలో... విమానాశ్రయం సమీపంలో జరిగిన దారుణ అత్యాచారం కేసులో యూపీ పోలీసులు కీలక పురోగతి సాధించారు.
ఆ విద్యార్థిని తన ప్రియుడితో కలిసి నడుస్తూ ఒక రీల్ చిత్రీకరిస్తోంది. అటవీ సంరక్షకులుగా నటిస్తున్న ముగ్గురు యువకులు, ఆ యువకుడిని బెల్టుతో కొట్టి, చేతులు కాళ్లు కట్టేసి, విద్యార్థినిని పొదల్లోకి తీసుకెళ్లి ఒకరి తర్వాత ఒకరు ఆమెపై అత్యాచారం చేశారు. సీసీటీవీ, నిఘా, సమాచారం అందించిన వారి సహాయంతో పోలీసులు 48 గంటల్లోనే ముగ్గురు నిందితులను గుర్తించారు. నిందితులు జితేంద్ర అలియాస్ భోలా (24), వివేక్ కుమార్, ప్రవీణ్ పటేల్. వారి అరెస్టు చేసేందుకు ఆచూకి చెబితే ఒక్కొక్కరికి 50,000 రూపాయల రివార్డు కూడా ప్రకటించారు.
జూలై 26న సాయంత్రం, భారతికూప్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మద్ఫా అటవీ ప్రాంతంలో యూపీ పోలీసులు, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) బృందం మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. నిందితుడు భోలా కాల్పులు జరపగా, ప్రతిగా జరిపిన కాల్పుల్లో అతని కాలికి గాయమైంది. అనంతరం అతడిని అరెస్టు చేశారు. బహిల్పుర్వా పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ రాఘవేంద్ర రాజ్పుత్ చేతికి కూడా బుల్లెట్ గాయమైంది. ఇద్దరూ చికిత్స పొందుతున్నారు.
ఘటనా స్థలం నుండి రెండు అక్రమ 315-బోర్ పిస్టళ్లు, కాట్రిడ్జ్లు, ఘటనా స్థలంలో ఉపయోగించిన మోటార్సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలింపు కొనసాగుతోంది. సీన్ రీకన్స్ట్రక్షన్ చేసేందుకు నిందితులను పోలీసులు ఘటనా స్థలానికి తీసుకువెళ్తుండగా స్థానిక జనం నిందితులపై దాడి చేసేందుకు ఎగబడ్డారు. నిందితులను పోలీసులు కాపాడి వాహనంలోకి ఎక్కించారు.
19 वर्षीय युवती का उत्तराखंड के रुद्रपुर में तीन युवकों ने कथित तौर पर अपहरण कर सामूहिक दुष्कर्म किया।
— Shaurya Mishra (@shauryabjym) July 28, 2026
आरोपियों को गिरफ्तार करने पहुंची पुलिस पर उन्होंने कथित तौर पर फायरिंग कर दी। जवाबी कार्रवाई में पुलिस ने एक आरोपी के पैर में गोली मारकर तीनों को गिरफ्तार कर लिया।
अगले दिन… pic.twitter.com/qGqk7BHveH
