1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Pawan Kalyan: AP Adopting Science-Driven Approach to Tiger Conservation

Pawan Kalyan: మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ల నుంచి ఆడ పులులను రప్పిస్తాం.. పవన్

Tigers
Tigers
అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వన్యప్రాణుల సంరక్షణ పట్ల రాష్ట్రం నిబద్ధతను పునరుద్ఘాటించారు. అడవులు, నదులు, జీవవైవిధ్యం, పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో పులుల రక్షణ అత్యంత కీలకమని చెప్పారు. 
 
ఎక్స్ వేదికగా పవన్ కళ్యాణ్ స్పందిస్తూ, "పులి భారతదేశ జాతీయ జంతువు, మన అడవుల సంరక్షకి, ఆరోగ్యకరమైన పర్యావరణ వ్యవస్థకు ప్రతీక" అని పేర్కొన్నారు. రాష్ట్రంలో వన్యప్రాణుల సంరక్షణలో సాధించిన విజయాలను వివరిస్తూ, నిరంతర సంరక్షణ కృషి ఫలితంగానే 'అఖిల భారత పులుల గణన-2026'లో భాగంగా దేశంలోనే అతిపెద్దదైన నాగార్జునసాగర్-శ్రీశైలం పులుల సంరక్షణ కేంద్రంలో 68 పెద్ద పులులు, 11 పిల్లలు గుర్తించబడ్డాయని ఆయన పేర్కొన్నారు. 
 
అక్రమ వేటను అరికట్టే వ్యవస్థను బలోపేతం చేయడం, రక్షణ కేంద్రాల సంఖ్యను 89 నుండి 150కి పెంచడం, అలాగే డ్రోన్లు, కెమెరా ట్రాప్‌లు, ప్రత్యేకమైన హనుమాన్ కార్యక్రమం వంటి అధునాతన సాంకేతికతలను వినియోగించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ వన్యప్రాణుల సంరక్షణలో శాస్త్రీయ విధానాన్ని అనుసరిస్తోందని పవన్ కళ్యాణ్ తెలిపారు. 
 
తూర్పు కనుమలలో పులుల సంఖ్యను పెంచేందుకు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలతో కలిసి ఆడ పులులను ఇక్కడికి తరలించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన తెలిపారు. వన్యప్రాణుల సంరక్షణలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. 
 
నల్లమల అడవుల్లో పులుల గర్జన నిరంతరం వినిపించేలా చూడటం ద్వారా, ప్రకృతిని రక్షించుకోవడానికి, దేశం  అమూల్యమైన జీవవైవిధ్యాన్ని కాపాడుకోవడానికి భావి తరాలకు స్ఫూర్తినివ్వాలని ఆయన కోరారు.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభం. సొమ్ము ఒకరిది సోకు ఒకరిది.. జగన్ ఫైర్