సంబంధిత వార్తలు
- కారుతో ఢీకొట్టి.. రెండు కిమీ దూరం దూసుకెళ్లిన డ్రైవర్
- తీవ్ర సమస్యగా సైనస్ .. ఆ గాయాలు కూడా ఇపుడు బాధిస్తున్నాయి : పవన్ కళ్యాణ్
- భార్య మరొకరితో వెళ్లిపోయిందనీ ఇద్దరు పిల్లలను కడతేర్చి ఆత్మహత్య చేసుకున్న భర్త
- Varalaxmi: పోలీస్ కంప్లైంట్ చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణపై స్పెషల్ సాంగ్
- మే 3 నీట్ ప్రవేశ పరీక్ష.. సర్వం సిద్ధం... పరీక్షా కేంద్రాల వద్ద జిరాక్స్ షాపులు క్లోజ్
Hyderabad: కుమారుడి సాయంతో ప్రియుడిని హత్య చేసింది
అక్రమ సంబంధాలతో నేరాల సంఖ్య పెరిగిపోతుంది. హైదరాబాద్లోని చింతల్, అంబేద్కర్ నగర్ ప్రాంతంలో ఒక వివాహిత మహిళ, తన కుమారుడి సహాయంతో తన ప్రియుడిని హత్య చేసింది. ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాకు చెందిన 40 ఏళ్ల శివారెడ్డి, గత పదేళ్లుగా సదరు మహిళతో సహజీవనం సాగిస్తున్నాడు.
ఆ మహిళ కుమారుడు (19 ఏళ్లు) కూడా వారితో పాటే నివసిస్తున్నాడు. గత కొన్ని నెలలుగా, శివారెడ్డి ఆ ఇద్దరినీ వేధిస్తున్నాడు. ఆదివారం రాత్రి, ఆ మహిళ, ఆమె కుమారుడు కలిసి శివారెడ్డిని నరికి చంపారు.
అనంతరం, వారు మృతదేహాన్ని ఒక గోనెసంచిలో మూటగట్టి, దానిని తరలించడానికి ప్రయత్నించారు. సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ఆ మహిళను, ఆమె కుమారుడిని అదుపులోకి తీసుకుని, ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు.
