1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: శనివారం, 26 మే 2018 (21:42 IST)

కృష్ణ తులసి ఆకులు పొడి చేసి రోజూ చిటికెడు తీసుకుంటే?

ఇటీవల కాలంలో మధుమేహం వ్యాధితో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిసార్లు మందులు వాడినా మనం తీసుకునే ఆహారం సరియైనది కాకపోవడం వల్ల ఈ సమస్య ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది. అసలు ఈ మధుమేహం సమస్య రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అవేంట

ఇటీవల కాలంలో మధుమేహం వ్యాధితో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిసార్లు మందులు వాడినా మనం తీసుకునే ఆహారం సరియైనది కాకపోవడం వల్ల ఈ సమస్య ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది. అసలు ఈ మధుమేహం సమస్య రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
 
1. కృష్ణతులసి ఆకులు తెచ్చి శుభ్రంగా కడిగి నీడలో ఎండబెట్టి పొడి చేసి సీసాలో ఉంచుకుని ఏ ఆహారం వండినా దానిలో చిటికెడు పొడి వేసుకోవాలి. ఇలా చేస్తున్నట్లయితే మధుమేహం వ్యాధి రాకుండా ఉంటుంది.
 
2. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. అలాగే మన శరీర బరువుని ఎక్కువ కాకుండా చూసుకోవాలి. ప్రతిరోజు తప్పకుండా వ్యాయామం చేయాలి. రోజుకి ఒక గంట వాకింగ్ తప్పనిసరిగా చేయాలి.
 
3. మనం తీసుకునే రోజువారి ఆహారంలో తీపి, నూనె పదార్థాల వాడకం వీలయినంతవరకు తగ్గించాలి. పసుపు, అల్లం, వెల్లుల్లి ఆహారంలో ఎక్కువగా వాడాలి. రాత్రి ఒక చెంచా మెంతులు కప్పు నీటిలో నానబెట్టి ఉదయాన్నే తాగాలి. భోజనం టేబుల్ పైన కాక క్రింద కూర్చుని తినాలి. 
 
4. పసుపు, ఉసిరి పొడి రెండూ సమానంగా కలిపి అర చెంచా పొడి రోజూ రెండు పూటలా నీటితో భోజనానికి అరగంట ముందు తీసుకోవాలి. మనం తినే ఆహారాన్ని బాగా నమిలి తినాలి.