1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : శుక్రవారం, 20 మే 2016 (13:36 IST)

బాలికలతో బోకో హరమ్ తీవ్రవాదుల బలవంతపు శృంగారం.. గర్భందాల్చుతున్న మైనర్లు

రెండేళ్ల క్రితం నైజిరీయాలోని చిబోక్ అనే గ్రామంలోని పాఠశాలపై  పెద్ద ఎత్తున దాడి చేసిన బొకోహారమ్ ఉగ్రవాదులు 273 మంది బాలికల్ని కిడ్నాప్ చేశారు. ఈ ఘటన అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. అయితే, ఈ 273 మంది బాలికలో ఒకరైన అమీనా అలి దర్శా కెకి అనే బాలిక చేతిలో చంటిబిడ్డతో తిరిగి వచ్చింది. ఉగ్రవాదులను అణిచివేసేందుకు నైజిరీయా సైన్యం నిర్వహిస్తున్న పోరులో భాగంగా ఈ బాలికకు ఉగ్రవాదుల చెరనుండి విముక్తి లభించింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే... రెండేళ్ల క్రితం కిడ్నాప్‌కు గురైన బాలికలతా మైనర్లే. వారి కోసం సైన్యం ఎంత గాలించిన ప్రయోజనం లేకుండా పోయింది. అలా బలవంతంగా తీసుకెళ్లిన వారిని ముస్లిం మతంలోకి మార్చడం, రకరకాల పనులకు ఉపయోగించడం, బలవంతపు పెళ్లిల్లు చేసుకోవడం ఇలాంటి దారుణాలకు పాల్పడ్డారు. 
 
కాగా అమీనాని వారి చెరలో ఉన్నప్పుడు ఓ ఉగ్రవాది బలవంతపు వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత బలవంతపు శృంగారంలో పాల్గొని వదిలేశాడు. దీని ఫలితంగా ఆ యువతి గర్భం దాల్చి ఓ పండంటి పాపకు జన్మనిచ్చింది. ఆ పాపను ఎత్తుకుని సాంబిసా అడవిలో తిరుగుతూ నైజీరియా సైన్యానికి కనిపించడంతో ఆమెను సురక్షితంగా హెలికాప్టర్ ద్వారా తరలించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.