1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 26 సెప్టెంబరు 2016 (09:42 IST)

'నాకు చంపడమంటే ఇష్టం. వారిని చంపడం ఇంకా ఇష్టం': బ్రిటన్ మాజీ సెక్యూరిటీ గార్డు

ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాద సంస్థలో చేరిన బ్రిటన్‌కు చెందిన మాజీ సెక్యూరిటీ గార్డు బ్రిట్ ఒమర్ హుస్సైన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనకు చంపడమంటే ఎంతో ఇష్టమన్నాడు. బ్రిటన్‌కు చెందిన హుస్సైన్ గతంలో మారిసన్స్

ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాద సంస్థలో చేరిన బ్రిటన్‌కు చెందిన మాజీ సెక్యూరిటీ గార్డు బ్రిట్ ఒమర్ హుస్సైన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనకు చంపడమంటే ఎంతో ఇష్టమన్నాడు. బ్రిటన్‌కు చెందిన హుస్సైన్ గతంలో మారిసన్స్ సూపర్ మార్కెట్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేశాడు. తర్వాత జిహాదీగా మారాలని భావించిన ఆయన సిరియా చేరుకుని ఐసిస్‌లో చేరాడు. ఇప్పుడు తనకు బ్రిటన్ సైనికులను చంపాలని ఉందని పేర్కొన్నాడు.
 
‘ది డైలీ స్టార్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హుస్సైన్ మాట్లాడుతూ చిన్నారులతో ఇప్పటినుంచే బందీలను చంపించడం వల్ల యుద్ధం సమయంలో వారు మరింత పరిణితి పొందుతారని, దానికి సన్నద్ధులవుతారన్నారు. 
 
తన సొంత కుమారుడితో కూడా బందీల తలలు నరికించడంపై స్పందిస్తూ వ్యక్తిగతంగా ఈ విషయంలో తాను చాలా సంతోషంగా ఉన్నట్టు చెప్పాడు. అలా చేయకుంటే వారు పిరికిపందల్లా తయారవుతారని పేర్కొన్నాడు.
 
‘‘నాకు చంపడమంటే ఇష్టం. వారిని చంపడం ఇంకా ఇష్టం. నేను వ్యక్తిగతంగా డేవిడ్ కామెరూన్‌ను అభ్యర్థించా. పదాతి దళాలను పంపించాలని కోరా’’ దీనిపై బ్రిటన్ వైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నాడు.