శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 27 సెప్టెంబరు 2016 (16:22 IST)

జపాన్ బుల్లెట్ రైలులో పాము.. ఆగిన రైలు.. ఎవరిదైనా పాము తప్పిపోయిందా?

జపాన్ దేశంలో పాములను పెంపుడు జీవులుగా పెంచుకుంటారన్న విషయం తెలిసిందే. ఆ దేశంలో పాములంటే జడుసుకునేవారు ఎక్కువ సంఖ్యలో ఉండరనే చెప్పాలి. కానీ ఓ పామును చూసి కొందరు ప్రయాణీకులు బుల్లెట్ రైలును ఆపేశారు. ఈ

జపాన్ దేశంలో పాములను పెంపుడు జీవులుగా పెంచుకుంటారన్న విషయం తెలిసిందే. ఆ దేశంలో పాములంటే జడుసుకునేవారు ఎక్కువ సంఖ్యలో ఉండరనే చెప్పాలి. కానీ ఓ పామును చూసి కొందరు ప్రయాణీకులు  బుల్లెట్ రైలును ఆపేశారు. ఈ ఘటన జపాన్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. టోక్యో నుంచి హిరోషిమా వెళ్తున్న షింకెన్‌స‌న్ బుల్లెట్ రైళ్లో పాము కనిపించింది. సీట్ల మ‌ధ్య ఉన్న ఆ స‌ర్పాన్ని ఓ ప్రయాణీకుడు చూశాడు. అంతే రైలును ఆపేశాడు. 
 
అయితే బుల్లెట్ రైలులోని ఆ పాము ద్వారా ప్రయాణీకులకు ఎలాంటి హానీ చేకూరలేదు. బ్రౌన్ స్నేక్ లేదా రాట్ స్నేక్ అని ఈ సర్పాన్ని పిలుస్తారు. ఇది 30 సెంటీమీట‌ర్ల పొడ‌వు ఉంది. అయితే అది విష స‌ర్పం కాద‌ని అధికారులు తెలిపారు. దీన్ని కొంద‌రు పెంపుడు జంతువుగా ట్రీట్ చేస్తారు. దాంతో రైలు సిబ్బంది రైళ్లోనే ఓ ప్ర‌ట‌క‌న చేశారు. ఎవ‌రిదైనా పాము త‌ప్పిపోయిందా అంటూ ప్ర‌క‌టించారు. 
 
కానీ ప్యాసింజెర్లు ఎవ‌రూ ఆ స‌ర్పాన్ని తీసుకునేందుకు ముందుకు రాలేదు. ఇంత జరిగి రైలు ఆగిపోయినా.. వాస్తవానికి క్రమశిక్షణకు మారుపేరైన జపాన్ రైలు మాత్రం నిర్దేశిత సమయానికి స్టేషన్‌కు చేరుకోవడం గమనార్హం.