1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 29 మే 2020 (19:51 IST)

కరోనా శాంపిల్స్‌ను కోతులు ఎత్తుకెళ్లిపోయాయి.. వాటికి కోవిడ్ వస్తుందా?

మీరట్ మెడికల్ కాలేజీ ప్రాంగణంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. ఇంతకీ ఏమైందంటే..  కొన్ని కోతులు కరోనా వైరస్ టెస్ట్ శాంపిల్స్‌ను ఎత్తుకుని వెళ్లిపోయాయి. కరోనా వైరస్ పరీక్షలు జరిపిన తర్వాత ఆ టెస్ట్ కిట్లను ఓ ల్యాబ్ టెక్నీషియన్ తీసుకుని వెళ్తుండగా కోతుల మూక దాడి చేసి ఆ టెస్ట్ కిట్లను ఎత్తుకుపోయింది. 
 
ముగ్గురు కరోనా అనుమానితులకు చేసిన టెస్ట్ శాంపిల్స్ అందులో ఉండిపోయాయి. ప్రస్తుతం ఆ శాంపిల్స్ కోతుల వద్ద ఉండడంతో వైద్యులు, వైద్య సిబ్బంది తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఆ కోతి మూక దాడి చేసి కరోనా టెస్ట్ శాంపిల్స్‌ను ఎత్తుకుని వెళ్తున్న దృశ్యాలు కూడా కొన్ని టీవీ ఛానళ్లలో ప్రసారం అయ్యాయి. 
 
అందులో ఓ కోతి శాంపిల్ కిట్‌ను కొరుకుతున్న దృశ్యాలు కూడా ఉన్నాయి. దీంతో కోతులను పట్టుకోవాలంటూ డాక్టర్లు అటవీ శాఖ అధికారుల సాయం కోరారు. ఈ శాంపిల్ ద్వారా కోతులకు కరోనా వచ్చే ప్రమాదం వుందని వార్తలు వస్తున్నాయి.