1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
  4. janmashtami celebrations in Tirumala

తిరుపతిలో క్రిష్ణాష్టమి వేడుకలు

janmashtami celebrations
తిరుపతిలోని టిటిడి గోశాలో శాస్త్రోక్తంగా గోకులాష్టమి గోపూజ కార్యక్రమం నిర్వహించారు. టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఈఓ కె.ఎస్.జవహర్ రెడ్డిలు గోశాలలోని వేణుగోపాలస్వామి వారిని దర్సించుకున్నారు. 
 
అనంతరం గోమాత, దూడకు అర్చకుల మంత్రాల నడుమ నూతన వస్త్రాలు, పూలమాలలు వేసి శాస్త్రోక్తంగా పూజలు చేశారు. అనంతరం గోమాత, దూడకు ప్రదక్షిణలు చేసి హారతి ఇచ్చారు. గోమాత పాలు పితికి వాటిని తీసుకుని వెళ్ళి అర్చకులకు అందించి అభిషేకం చేయించారు.
 
అలాగే శ్రీ వేంకటేశ్వర మహామంత్ర పుస్తక జపసమర్పణ చేస్తూ ఆలయాన్ని సందర్సించి అక్కడ పుస్తకంలో ఓం నమో వేంకటేశాయ అని రాశారు. తిరుపతిలోనే కాదు తిరుమలలోను గోకులాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి.
 
తిరుమలలోని గోగర్భం డ్యాం చెంత ఉన్న ఉద్యావనంలో కాళీయమర్ధనుడు అయిన చిన్నిక్రిష్ణునికి ప్రత్యేక పూజలు జరిపారు. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, కుంకుమ, చందనం, పంచామృతాభిషేకాలు నిర్వహించారు. 
About Writer
జె
తర్వాతి కథనం
31-08-2021 మంగళవారం దినఫలాలు - వేణుగోపాల స్వామిని ఆరాధించినా...