తిరుమలలో అనూహ్యంగా పెరిగిన రద్దీ
తిరుమల తిరుపతి దేవస్థానం కొండపై శుక్రవారం భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. భక్తుల రాక ఒక్కసారిగా పోటెత్తింది. గురువారం 50,500 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోగా శుక్రవారం సర్వ దర్శనం కోసం ఉదయం 5 గంటల నుంచి 16 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు.
సర్వ దర్శనం భక్తులు 10 గంటలకు పైగా వేచి ఉంటేనే శ్రీవారి దర్శనం లభిస్తోంది. కాలినడక భక్తులు 6 కంపార్టుమెంట్లలో వేచి ఉండగా వారికి 4 గంటల సమయం తరువాత దర్శన భాగ్యం లభిస్తోంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తితిదే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
