ఆదివారం, 29 సెప్టెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 4 ఆగస్టు 2021 (13:33 IST)

శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విడుదల చేసిన తితిదే

కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) బుధవారం రిలీజ్ చేసింది. ఈ నెల 17 నుంచి 20 వరకు సంబంధించిన కోటా దర్శన టికెట్లు విడుదల చేసింది. 
 
తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లను తితిదే విడుదల చేసింది. ఈ నెల 17 నుంచి 20 వరకు సంబంధించిన టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఈ నెల 17 నుంచి నాలుగు రోజల పాటు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. 
 
ఈ రోజులకు సంబంధించి ప్రత్యేక టికెట్లను విడుదల చేశారు. టికెట్లను విడుదల చేసిన కొంత సమయానికే చాలా వరకు అమ్ముడుపోయాయి. అధికసంఖ్యలో భక్తులు టికెట్లు బుక్​ చేసుకునేందుకు ఆసక్తి కనబర్చడంతో వెబ్‌సైట్‌ స్తంభించింది.