బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Modified: బుధవారం, 26 జూన్ 2019 (12:23 IST)

కీర్తి సురేష్‌కి బాగా పెరిగింద‌ట..‌.

మ‌హాన‌టి సినిమాలో సావిత్రి పాత్ర‌ను అద్భుతంగా పోషించి తెలుగు వారి హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర వేసింది కీర్తి సురేష్. ఈ సినిమా త‌ర్వాత ఆమెకు క్రేజ్ బాగా పెరిగింది. దీంతో కీర్తితో సినిమాలు చేసేందుకు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఇంట్ర‌స్ట్ చూపిస్తున్నారు. ఇటీవ‌ల టాలీవుడ్ కింగ్ నాగార్జున మ‌న్మ‌థుడు 2 సినిమాలో గెస్ట్ రోల్ చేసింది కీర్తి. ప్ర‌స్తుతం కీర్తి సురేష్ ప్ర‌ధాన పాత్ర‌లో నూత‌న ద‌ర్శ‌కుడు న‌రేంద్ర ఓ సినిమాని తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది.
 
అయితే... ఆమెకు డిమాండ్ బాగా పెరుగుతోంది. ఓ వైపు త‌మిళ్ నిర్మాతలు మ‌రోవైపు తెలుగు నిర్మాతలు పోటీప‌డి మ‌రీ కీర్తి కోసం క్యూ క‌డుతున్నాయి. నాగార్జున కెరీర్లో మ‌ర‌చిపోలేని చిత్రం సోగ్గాడే చిన్ని నాయ‌నా. ఈ సినిమాకి సీక్వెల్‌గా బంగార్రాజు సినిమా రాబోతుంది. ఈ సినిమాలో నాగార్జున‌తో పాటు నాగ చైత‌న్య కూడా న‌టించ‌నున్నాడు. ఇందులో చైత‌న్య స‌ర‌స‌న కీర్తి సురేష్ న‌టించ‌నుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.
 
ఈ వార్త‌లు నిజ‌మే అని తెలిసింది. చైత‌న్య‌, కీర్తి సురేష్ క‌లిసి మ‌హాన‌టి సినిమాలో న‌టించారు. ఇప్పుడు మ‌ళ్లీ న‌టిస్తున్నారు. నితిన్‌తో కూడా న‌టించేందుకు కీర్తి సురేష్ ఓకే చెప్పింది. సో... కీర్తి సురేష్‌కి డిమాండ్ మామూలుగా లేదు. అందుక‌నే అనుకుంటా ఈ అమ్మడు ప్ర‌స్తుతం పారితోషికం పెంచే ఆలోచ‌న‌లో ఉంద‌ట‌.