హిందూ మతాన్ని స్వీకరించిన సమంత.. నాగార్జున ఇంట్లో మతమార్పిడి పూజలు?
సమంత-నాగ చైతన్య వివాహానికి నాగార్జున.. అమల దంపతులు ఓకె చెప్పేసినట్లే అంటూ వార్తలు వెలువడ్డాయి. చైతూ మంచి అమ్మాయిని చూసుకోవడం అమలకు ఆనందాన్నిచ్చింది అంటూ నాగ్ అన్నట్టు వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమన్న
సమంత-నాగ చైతన్య వివాహానికి నాగార్జున.. అమల దంపతులు ఓకె చెప్పేసినట్లే అంటూ వార్తలు వెలువడ్డాయి. చైతూ మంచి అమ్మాయిని చూసుకోవడం అమలకు ఆనందాన్నిచ్చింది అంటూ నాగ్ అన్నట్టు వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమన్న సంగతి తెలిసిందే. గడచిన కొన్నాళ్లుగా నేరుగా సమంత-చైతూల పేరుతోనే మొత్తం అన్ని రకాల ప్రసార మాధ్యమాల్లో వార్తల పరంపర సాగుతోంది.
సమంత అక్కినేని కుటుంబంతో కలిసిపోయి వారితో కుటుంబ సభ్యురాలిలాగే పార్టీలకు, ఫంక్షన్లకు హాజరవుతూ వస్తోంది. నాగార్జున కూడా వీరి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడంతో వచ్చే ఏడాది వీరిద్దరి పెళ్ళి జరగనుంది. ఇక ఇదిలావుంటే చైతన్య, సమంతల పెళ్ళి ఏ సాంప్రదాయాల ప్రకారం జరుగుతుందనే విషయం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది.
క్రిస్టియన్ అయిన సమంత, హిందువు అయిన నాగ చైతన్య ఈ ఇద్దరి పెళ్ళి రెండు సాంప్రాదాయాల ప్రకారం జరగనుందని వినిపించగా, తాజాగా నాగార్జున, నాగ చైతన్య, సమంతలు కలిసి చేసిన ఓ పూజ ఆసక్తికరంగా మారింది. నాగార్జున సమక్షంలో చైతన్య, సమంత ఇద్దరూ పూజలో కూర్చున్నట్లు కనిపించిన ఫోటోలు బయటికి వచ్చాయి.
పక్కనే నాగార్జున.. పురోహితులు కూడా నిలబడి ఉన్నారు. దీంతో వీరి ఎంగేజ్మెంట్ జరిగిపోయిందని ప్రచారం జరుగుతోంది. మరో వాదన ఏమిటంటే.. క్రిస్టియన్ మతస్తురాలైన సమంత హిందూ మతం పుచ్చుకుందని, హిందూ సాంప్రదాయాలు ప్రకారం వివాహం జరగాలంటే ముందు మత మార్పిడి జరగాలని, ఇప్పుడీ తంతునే జరిపారనే ప్రచారం కూడా వుంది. అసలు విషయం ఏమిటనేది ఇంకా తెలియాలి.