సాయిపల్లవికి కలిసిరాని బాలీవుడ్.. రామాయణంపై దృష్టి?
EK Din
ఈ చిత్రంలో సాయి పల్లవి సరసన జునైద్ ఖాన్ నటించారు. కానీ బలహీనమైన ప్రారంభం ప్రేక్షకులలో స్పష్టమైన ఆసక్తి కొరవడిందని సూచిస్తోంది. దక్షిణ చిత్ర పరిశ్రమలలో మంచి ప్రజాదరణ పొందిన సాయి పల్లవికి, హిందీ చిత్రసీమలో ఇది నిరాశాజనకమైన ఆరంభం రావడం ఆమె ఫ్యాన్సుకు మింగుడుపడటం లేదు.
అయినా సాయిపల్లవి ప్రస్తుతం తన దృష్టిని రణబీర్ కపూర్ కథానాయకుడిగా నటిస్తున్న తన తదుపరి పెద్ద ప్రాజెక్ట్ రామాయణంపైకి మళ్లింది. ఏక్ దిన్లో ఆమె ప్రదర్శనను బట్టి చూస్తే, సాయి పల్లవి ఇంకా ప్రధాన హిందీ మాట్లాడే ప్రేక్షకులతో అనుబంధాన్ని ఏర్పరచుకోలేదనిపిస్తోంది. దీనివల్ల మార్కెట్లో ఆమె స్థానాన్ని పటిష్టం చేసుకోవడానికి ఆమె రాబోయే ప్రాజెక్టులు అత్యంత కీలకం కానున్నాయి.
