శుక్రవారం, 27 జూన్ 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: సోమవారం, 3 అక్టోబరు 2016 (19:38 IST)

జీర్ణ సంబంధ వ్యాధితో బాధపడ్డానంటున్న సప్తగిరి

నటీనటులు సినిమా రంగంలో బిజీగా వుండటంతో కెరీర్‌ పైన దృష్టి పెడతారు కానీ.. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధగా వుంటారు. అలా హాస్య నటుడిగా బిజీగా వుండి.. ఆరోగ్యంపై దృష్టపెట్టకపోవడంతో జీర్ణసంబంధ వ్యాధితో బాధపడ్డానని నటుడు సప్తగిరి తెలియజేస్తున్నాడు.

నటీనటులు సినిమా రంగంలో బిజీగా వుండటంతో కెరీర్‌ పైన దృష్టి పెడతారు కానీ.. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధగా వుంటారు. అలా హాస్య నటుడిగా బిజీగా వుండి.. ఆరోగ్యంపై దృష్టపెట్టకపోవడంతో జీర్ణసంబంధ వ్యాధితో బాధపడ్డానని నటుడు సప్తగిరి తెలియజేస్తున్నాడు. 
 
సప్తగిరి మాట్లాడుతూ.. కమెడియన్‌గా బిజీ అవడంతో ఆరోగ్య విషయాలను పట్టించుకోక జీర్ణ సంబంధిత సమస్యలను ఎదుర్కొన్నాను. ఆ సమయంలో మాస్టర్స్‌ హోమియోపతి నిర్వహిస్తున్న రవికిరణ్‌ వైద్యంతో ఐదు రోజుల్లోనే రికవరీ అయ్యాను. 
 
అలా ఆ పరిచయంతో నా సినిమాకు అండగా నిలబడతానని మాటిచ్చి ఈ సినిమాతో నిర్మాతగా మారారు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన అనుభవంతో ఈ సినిమాకు నేనే స్క్రిప్ట్‌ రాసుకున్నాను. ఈ సినిమాను, నన్ను ఎవరు హ్యాండిల్‌ చేస్తారోనని ఆలోచించి అందుకు తగ్గ వ్యక్తిగా అరుణ్‌ పవార్‌ను ఎంచుకున్నాను. అరుణ్‌ ఈ సినిమాను చాలా చక్కగా తెరకెక్కించాడు. బుల్‌గానిన్‌ చక్కటి సంగీతాన్నందించారు. సినిమా విడుదల తర్వాత బుల్‌గానిన్‌ స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా పేరు సంపాదించుకుంటాడనే నమ్మకముంది' అన్నారు. 
 
కమెడియన్‌ సప్తగిరి హీరోగా 'సప్తగిరి ఎక్స్‌ ప్రెస్‌' రూపొందుతోంది. త్రివిక్రమ్‌ శిష్యుడు అరుణ్‌ పవార్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. డాక్టర్‌ కె.రవికిరణ్‌ సాయి సెల్యూలాయిడ్‌ సినిమాటిక్‌ క్రియేషన్స్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. కన్నడ నటి రోషిణీ ప్రకాశ్‌ హీరోయిన్‌గా పరిచయమవుతోంది. ఇటీవల పోలాండ్‌లో పాటల చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా షూటింగ్‌ చివరిదశకు చేరుకుంది. మోషన్‌ పోస్టర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సినిమా ఫస్ట్‌ లుక్‌, మోషన్‌ పోస్టర్‌ను మేర్లపాక గాంధీ విడుదల చేశారు.