సంబంధిత వార్తలు
- గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను స్వీకరించి మొక్కలు నాటిన యంగ్ హీరో అల్లు శిరీష్
- గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను స్వీకరించిన రేణూ దేశాయ్ (video)
- గ్రీన్ ఇండియా ఛాలెంజ్: మొక్కలు నాటిన ప్రముఖ హాస్యనటుడు పద్మశ్రీ బ్రహ్మానందం
- గ్రీన్ ఇండియా ఛాలెంజ్: మొక్కలు నాటిన జార్జి రెడ్డి మూవీ డైరెక్టర్ జీవన్ రెడ్డి
- గ్రీన్ ఇండియా ఛాలెంజ్: మొక్కలు నాటిన ప్రముఖ యాంకర్ ఉదయభాను
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను స్వీకరించి మొక్కలు నాటిన యువ నటి నక్షత్ర
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో-పౌండర్ రాఘవ ఇచ్చిన ఛాలెంజ్ను స్వీకరించి నేడు ఆదర్శ నగర్లో మొక్కలు నాటింది యువ కథానాయిక నక్షత్ర ( పలసా 1978 సినిమా).
ఈ సందర్భంగా నక్షత్ర మాట్లాడుతూ... రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ గారు ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో భాగంగా నేను మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందన్నారు. పచ్చదనం పెంచడం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.
ఈ సందర్భంగా "విరివిగా మొక్కలు నాటండి పచ్చదనాన్ని పెంచండి పర్యావరణాన్ని రక్షించండి అని తెలిపారు". ఈ సందర్భంగా ప్రముఖ నటుడు సూపర్ స్టార్ రజినీకాంత్, హీరోయిన్ రమ్యకృష్ణ , పలాస 1978 సినిమా డైరెక్టర్ కరుణ కుమార్లను గ్రీన్ చాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గన్ ఫౌండ్రీ కార్పొరేటర్ మమతా సంతోష్ గుప్తా, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధి కిషోర్ గౌడ్ పాల్గొన్నారు.
