జూ.ఎన్టీఆర్ 'జనతా గ్యారేజ్' చిత్రంలో మూడో హీరోయిన్గా విదిశ.. ఆగస్టు 12న రిలీజ్
యంగ్టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ''జనతా గ్యారేజ్''. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ మళయాళ నటుడు మోహన్లాల్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. కాగా ఇందులో సుహాసిని మణిరత్నం, సాయికుమార్, ముకుందన్ తదితరులు నటిస్తున్నారు.
ఇటీవలే శరవేగంగా చెన్నై షెడ్యూల్ పూర్తి చేసుకున్న టీం త్వరలోనే హైదరాబాద్లో షెడ్యూల్లో ఓ సాంగ్ను చిత్రీకరించేందుకు సిద్ధమవుతోంది. తిరు సినిమాటోగ్రాఫర్గా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇదిలావుంటే ఈ సినిమాలో మూడో హీరోయిన్ రోల్ కూడా ఉండగా అందుకోసం ముచ్చటగా మూడో హీరోయిన్ను కూడా ఎంపిక పనిలో ఉన్నారట యూనిట్ సభ్యులు. ఆ హీరోయిన్ ఎవరో కాదు విదిశ.
గతంలో అల్లరి నరేష్ సినిమా ''అత్తిలి సత్తిబాబు'', శ్రీకాంత్ ''దేవరాయ'' సినిమాలో హీరోయిన్గా నటించింది. కాగా ఈ రెండు సినిమాలు ప్లాప్ అవ్వడంతో తర్వాత ఆమెకు టాలీవుడ్లో ఛాన్సులు కరువయ్యాయి. దీంతో విదిశ ప్రస్తుతం కోలీవుడ్, మల్లూవుడ్, శాండల్వుడ్లలో పలు సినిమాలు చేసుకుంటూ బిజీ బిజీగా గడుపుతోంది.
కాగా ఈ చిత్రంలో విదిశ మళయాళ యువనటుడు ఉన్ని ముకుందన్కు భార్యగా కనిపిస్తుందట. జూనియర్ ఎన్టీఆర్ చిత్రంలో నటించే ఛాన్స్ రావడంతో అమ్మడు ఎగిరిగంతేసిందట. కాగా ఈ సినిమాను కృష్ణా పుష్కరాల సందర్భంగా ఆగస్టు 12న రిలీజ్ చేసేందుకు దర్శకనిర్మాతల సన్నాహాలు చేస్తున్నారు.