శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 9 ఆగస్టు 2019 (13:00 IST)

బిగ్ బాస్ హౌస్ ఆ ఇద్దరూ మిస్సింగ్.. ఎలిమినేషన్‌కు ముందే పారిపోయారా?

రియాల్టీ షో బిగ్ బాస్ మూడో సీజన్ ఇపుడు మూడో వారం చివరి దశకు చేరుకుంది. అయితే, బిగ్ బాస్ నుంచి అలీ, పునర్నవిలు కనిపించకుండా పోయారు. వీరిద్దరూ ఎలిమినేషన్‌కు ముందే పారిపోయారా అనే సందేహం కలుగుతోంది. ఎందుకంటే.. ఈ ఆదివారం బిగ్ బాస్ హౌస్ నుంచి తమన్నా, పునర్నవి, రాహుల్, వితికా, బాబా భాస్కర్‌లలో ఒకరు బయటకు వెళ్లాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో అలీ, పునర్నవి మిస్సింగ్ కావడం కుటుంబ సభ్యులను ఆందోళనకు గురిచేస్తోంది. 
 
మరోవైపు, సభ్యులకు కెప్టెన్ ఓ టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్‌లో నిధి ద‌క్కించుకునేందుకు ర‌వికృష్ణ నిధి బాక్స్ అద్ధాన్ని చేతితో ప‌గ‌ల‌గొట్టే ప్ర‌య‌త్నం చేసి గాయ‌ప‌డ్డాడు. దీంతో ఆయన మణికట్టుకి గాయమైంది. ఈ వివాదం గురించి 19వ ఎపిసోడ్‌లో కూడా చ‌ర్చ జరిగింది. వితిక ఆ సంఘ‌ట‌న గురించి త‌ల‌చుకుంటూ ఏడుస్తూ కూర్చుంది. ఆమెని వ‌రుణ్‌, రాహుల్‌లు ఓదార్చే ప్ర‌య‌త్నం చేశారు.
 
ర‌వికృష్ణ‌కి గాయం కావడానికి కార‌ణం శ్రీముఖి అని ఇంటి స‌భ్యులు బిగ్ బాస్‌కి చెప్ప‌డంతో ఆమెని వ‌చ్చే వారం ఎలిమినేషన్‌కు నేరుగా నామినేట్ చేశారు బిగ్ బాస్. అంతేకాదు ఈ టాస్క్‌ని కూడా రద్దు చేశారు. ఇక ఆ త‌ర్వాత అలీ రాజా, పునర్న‌విని ఒక్కొక్కరిగా క‌న్ఫెష‌న్ రూంలోకి పిలిపించిన బిగ్ బాస్ వారికి ఓ సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్ స‌క్సెస్ ఫుల్‌గా పూర్తి చేస్తే ఇమ్యునిటి ల‌భిస్తుంది. దాంతో వ‌చ్చే వారం నామినేష‌న్ కాకుండా ఉంటార‌ని బిగ్ బాస్ పేర్కొన్నారు. దీంతో ఆ సీక్రెట్ టాస్క్‌లో వారిద్ద‌రు పాల్గొనేందుకు ఆస‌క్తి చూపారు.