థియేటర్లలో కలెక్షన్లు పడిపోయాయి
Cinema hall ph
కోవిడ్ టైంలో థియేటర్ ఓపెన్ చేసేలా వై.ఎస్. జగన్ నిర్ణయం తీసుకున్నా ఎందుకనే జనాలు రావడంలేదు. చాలా చోట్ల ఓమిక్రాన్ తీవత్ర బాగా కనిపిస్తోంది. దానితో అందరూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ, షాపింగ్ మాల్స్ కు మాత్రం బాగానే జనాలు రావడం విశేషం. థియేటర్కు వచ్చి టైం వేస్ట్ చేయడం కంటే ఓటీటీ అవకాశం వుండడంతో ఇంటిలోనే కుటుంబమంతా సినిమా చూసేస్తున్నారు. మా బేనర్, మా హీరో తొలి సినిమా రౌడీ బాయ్స్ డేర్ చేసి విడుదల చేశాం. కానీ మేం అనుకున్నంత కలెక్షన్లు లేవు. చాలా చోట్ల తెలంగాణలో బంగార్రాజుకూడా లేవని కలెక్షన్లు తెలుపుతున్నాయి. ఆంధ్రలో బాగానే సంక్రాంతికి సినిమా చూసేశారు. దానితో దాదాపు 32.50 కోట్ల గ్రామ్ వచ్చింది. ఇంకా 4 కోట్లు వస్తే బ్రేక్ ఈవెన్ అవుతారు. అది కూడా త్వరలో చేరుతుందని ఎగ్జిబిటర్లు తెలియజేస్తున్నారు.
ఇక సంక్రాంతి తర్వాత ఇంకా థియేర్లలో సినిమాలు విడుదల ఒకటి అరా మినహా ఎవ్వరూ విడుదల చేయడంలేదు. దాదాపు ఫిబ్రవరి వరకు మీడియం సినిమాలు కూడా విడుదలకు నోచుకోవని తెలుస్తోంది. 21న నట్టికుమార్ రూపొందిన `సైకో వర్మ`. పరిమితంగా విడుదలైతే పద్మశ్రీ అనే హార్రర్ మూవీ ఈరోజు విడుదలైంది. అదేవిధంగా ఆర్.ఆర్.ఆర్. సినిమా ఏప్రిల్లో విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అప్పటివరకు పెద్దగా సినిమాలు వుండవని తెలుస్తోంది.
