1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 4 జనవరి 2023 (15:17 IST)

విద్వత్‌ వున్నా సినిమారంగంలో సర్దుకుపోవాలి : రామజోగయ్య శాస్త్రి

Ramajogaiah Shastri
Ramajogaiah Shastri
ఎంత మేథావి అయినా ఎంత విద్వత్తు వున్నా మనం రాసే పదాలు, పలికే మాటలు పామరుడు నుండి పెద్దవారి వరకు అర్థమయ్యేలా వుండాలని గీత రచయిత రామజోగయ్య శాస్త్రి అన్నారు. చిరంజీవి నటించిన ఆచార్య సినిమాలో ‘లాహే.. లాహే.. అంటూ శివునిపై సాగే పాటలో అర్థవంతమైన సాహిత్యంతోపాటు అప్పటి తరానికి చెందిన గ్రాంథికం కూడావుంటుంది. ఇది తెలియని ఇప్పటితరం ఇలా రాస్తే ఎలా? అనే చర్చ అప్పట్లో పెట్టారు. దీనిపై రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ, ఆ పాటను అలానే రాయాలి అంటూ వివరించారు.
 
ఇక తాజాగా వీరనరసింహారెడ్డి, వాల్తేర్‌ వీరయ్య చిత్రాలతోపాటు తమిళ విజయ్‌ ‘వారసుడు’లోనూ పాటలు రాశారు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలు అవే. మిగిలిన ఏ సినిమాలు విడుదల కావడంలేదు. ఒకరకంగా మూడు సినిమాలకు పనిచేసిన ఏకైక వ్యక్తి రామజోగయ్య శాస్త్రి మాత్రమే. ఇలా రాయడం మనం కోరుకుంటే జరగదు. అప్పుడప్పుడు అలా జరిగిపోతుంటాయని చెబుతున్నారు. మనకు ఎంత విద్వత్‌ వున్నా నేను ఇలానే రాస్తాను అనే గిరీ గీసుకు కూర్చుంటే సినిమారంగంలో చెల్లదు. పరిస్థితితులను బట్టి సర్దుకుపోయి దర్శక నిర్మాతలకు, సంగీత దర్శకులకు అనుగుణంగా నడుచుకుంటూ వుండాలని గ్రహించానని పేర్కొన్నారు.