గురువారం, 6 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 13 జనవరి 2017 (15:56 IST)

రూ.600కోట్లతో మహాభారతం.. భీముడిగా మోహన్‌లాల్: నాగ్ కీలక పాత్ర-ద్రౌపదిగా ఐష్-అర్జునుడిగా విక్రమ్..

మహాభారతంలోని కొన్ని ఎపిసోడ్స్‌ సినిమా రూపుదిద్దుకోనున్నాయి. ఈ సినిమా కోసం రూ.600 కోట్లు వెచ్చించనున్నారు. ఈ మహా ప్రాజెక్టు కోసం అక్కినేని నాగార్జున, మలయాళ నటుడు మోహన్‌లాల్ చేతులు కలపనున్నారు. ‘రంధమూలం

మహాభారతంలోని కొన్ని ఎపిసోడ్స్‌ సినిమా రూపుదిద్దుకోనున్నాయి. ఈ సినిమా కోసం రూ.600 కోట్లు వెచ్చించనున్నారు. ఈ మహా ప్రాజెక్టు కోసం అక్కినేని నాగార్జున, మలయాళ నటుడు మోహన్‌లాల్ చేతులు కలపనున్నారు. ‘రంధమూలం’ మహాభారత గాథలోని కొన్ని పర్వాలను ఆధారంగా చేసుకుని మలయాళ రచయిత ఎంటీ వాసుదేవన్ రచించిన నవల నుంచి ఈ సినిమాను రూపొందించనున్నారు. 
 
కురుపాండవులే ఈ రచనలో ప్రధాన పాత్రధారులు. దీన్ని సినిమా తీసుకొచ్చే దిశగా మోహన్ లాల్ ప్రయత్నాలు చేశారు. మూడేళ్ల కిందటే ఈ ప్రతిపాదన వచ్చినా ఎందుకో పట్టాలెక్కలేదు. తాజాగా లాల్ మాట్లాడుతూ ‘రంధమూలం’ ను సినిమాగా తీసుకొస్తానని వ్యాఖ్యానించాడు. దానికి ఏకంగా ఆరువందల కోట్ల రూపాయల బడ్జెట్‌తో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టుగా ప్రకటించారు, 
 
ఇక భారత దేశ సినీ చరిత్రలోనే ఏకంగా ఆరు వందల కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందిన సినిమాలేవీ ఇంత వరకూ లేవు. ఇదే జరిగితే ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా నిలుస్తుంది. ఈ నవల భీమసేనుని ప్రధాన పాత్రగా సాగుతుందట. 
 
భీమసేనుడిగా ఈ చిత్రంలో మోహన్ లాల్ నటిస్తారని తెలుస్తోంది. ఇక భీష్ముడి పాత్రకు అమితాబ్‌ను, అర్జునుడి పాత్రకు విక్రమ్‌ను, ద్రౌపది పాత్రకు ఐశ్వర్యరాయ్‌ను తీసుకుంటారని సమాచారం. ఈ సినిమాలో నాగార్జున ఒక ముఖ్యపాత్రను చేయబోతున్నాడట. మలయాళ, తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తారని తెలిసింది.