శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Updated : శనివారం, 5 డిశెంబరు 2020 (15:43 IST)

కియారా అద్వానీ జస్ట్ ఎస్కేప్, కోవిడ్ వాళ్లను పట్టుకుంది (video)

బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ హీరోగా, కియారా అద్వానీ హీరోయిన్‌గా తెరకెక్కుతున్న చిత్రం షూటింగ్ కరోనావైరస్ కారణంగా ఆగిపోయింది. ఈ చిత్రంలో నటిస్తున్న హీరో వరుణ్, నీతూకపూర్, దర్శకుడు రాజ్ మెహతాలకు కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. దీనితో చిత్ర షూటింగ్ నిలిపివేస్తున్నట్లు యూనిట్ ప్రకటించింది.
 
కాగా హీరోయిన్ కియారా అద్వానీ జస్ట్ ఎస్కేప్ అయ్యిందంటూ బాలీవుడ్ జనం చెపుతున్నారు. ఈ చిత్రం షూటింగులో కియారా కూడా పాల్గొనాల్సి వుంది. ఇంతలోనే హీరోకి, దర్శకుడికి కరోనా అని తేలడంతో ఆమె ఆగిపోయినట్లు సమాచారం.