శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 18 నవంబరు 2018 (17:55 IST)

పూజా హెగ్డే సిన్సియారిటీకి చిత్ర యూనిట్ ఫిదా

టాలీవుడ్‌లో జిగేల్‌రాణిగా చెరగని ముద్రవేసుకున్న హీరోయిన్ పూజాహెగ్డే. ఈ ముద్దుగుమ్మ అటు తెలుగు, హిందీ చిత్రాల్లో నటిస్తోంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం 'అరవింద సమేత వీరరాఘవ' చిత్రంలో నటించిన పూజా.. బాలీవుడ్‌లో అక్షయ్ కుమార్‌తో "హౌస్ ఫుల్-4" అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో పూజ తన పాత్ర షూటింగ్ పూర్తయ్యేంత వరకు చూపించిన శ్రద్ధకు చిత్ర యూనిట్ ఫిదా అయిపోయింది. 
 
ఈ చిత్రం షూటింగ్ ముంబైలో జరిగింది. షూటింగ్ సమయంలో పూజా హెగ్డే జలుబు, దగ్గు సమస్యలు బాధించాయి. అయితే, పూజా హెగ్డే తన సమస్యను ఏమాత్రం లెక్కచేయకుండా మందులు వాడుతూ షెడ్యూల్ ప్రకారం అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి చేసింది. 
 
జలుబు, దగ్గు ఉన్నా సినిమా ఆలస్యమవకూడదని భావించి షూటింగ్‌లో పాల్గొంది. దీంతో ఆమె సిన్సియారిటీకి చిత్ర యూనిట్ ఆశ్చర్యపోయింది. కాదా, పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగులో మహేష్ బాబు నటిస్తున్న "మహర్షి" చిత్రంలో నటిస్తోంది. అలాగే, హీరో ప్రభాస్ నటించే 20వ చిత్రంలో కూడా హీరోయిన్‌గా ఎంపికైంది.