1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By chitra
Last Updated : సోమవారం, 3 అక్టోబరు 2016 (17:07 IST)

భారత్‌లో సల్మాన్ ఖాన్‌ను మించిన పెద్ద టెర్రరిస్టు మరొకరు లేరు : పోసాని కృష్ణమురళి

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌‌పై టాలీవుడ్ నటుడు పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ దేశంలో సల్మాన్‌ను మించిన తీవ్రవాది మరొకరు లేరని ఆయన వ్యాఖ్యానించారు.

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌‌పై టాలీవుడ్ నటుడు పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ దేశంలో సల్మాన్‌ను మించిన తీవ్రవాది మరొకరు లేరని ఆయన వ్యాఖ్యానించారు. 
 
యురీ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ నటీనటులపై నిషేధం విధిస్తూ భారత ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని సల్మాన్ ఖాన్ తప్పుపట్టాడు. పాక్ నటులపై భారత్‌లో నిషేధం విధించడం కరెక్ట్ కాదన్నాడు. సినిమాలకు, కళాకారులకు ఎళ్లలు లేవన్న సల్మాన్ ఖాన్.. నటులు వేరు, ఉగ్రవాదులు వేరు అని వ్యాఖ్యానించాడు. ఉరీలో ఆర్మీ సెక్టార్‌పై దాడులు చేసింది నటులు కాదు ఉగ్రవాదులని సల్మాన్ ఖాన్ చెప్పాడు. 
 
అంతేకాదు పాక్ నటులు టెర్రరిస్టులు కాదన్న సల్మాన్ ఖాన్.. వారిని భారత్‌కు రావాల్సిందిగా కోరిన విషయం తెలిసిందే. దీంతో సల్మాన్ ఖాన్‌పై విమర్శల యుద్ధం మొదలైంది. ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్థాన్ నటులకు మద్దతుగా నిలిచే బాలీవుడ్ హీరోల సినిమాలు ఆడనివ్వబోమని మహారాష్ట్ర నవనిర్మాణ్ (ఎంఎన్ఎస్) అధినేత రాజ్ థాక్రే హెచ్చరించారు. వందకోట్లపైగా జనాభా ఉన్న దేశంలో ప్రతిభ ఉన్న నటులే దొరకడం లేదా? పాకిస్థాన్ నటులను ఎందుకు రప్పిస్తున్నారని రాజ్ మండిపడ్డారు. 
 
మరోపక్క ప్రముఖ మాటల రచయిత, నటుడు పోసాని కృష్ణ మురళి కండలవీరుడిపై మండిపడ్డారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పోసాని మాట్లాడుతూ... సల్మాన్ ఖాన్ అంత ఉత్తముడైతే, ఆ రోజు తన కారు యాక్సిడెంట్ జరిగిన రోజున అక్కడే ఉండకుండా ఎందుకు పారిపోయాడని ప్రశ్నించారు. ఈ దేశంలో ''సల్మాన్ ఖాన్ కంటే పెద్ద తీవ్రవాది మరెవరూ లేరని'' పోసాని ఘాటుగా వ్యాఖ్యానించారు.