1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 13 అక్టోబరు 2021 (11:26 IST)

'చూపే బంగారమయ్యేనే శ్రీవల్లి' ... పుష్ప నుంచి మరో ఆడియో సాంగ్ రిలీజ్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - కె.సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం "పుష్ప". రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్. ఈ సినిమా నుంచి శ్రీ‌వ‌ల్లి పాట ప్రోమోను ఆ సినిమా యూనిట్ మంగళవారం రిలీజ్ చేయగా, బుధవారం ఆడియో సాంగ్‌ను రిలీజ్ చేసింది. 
 
ఈ సినిమాలో రష్మిక మందన్నా శ్రీ‌వ‌ల్లిగా నటిస్తోంది. 'చూపే బంగారమయ్యేనే శ్రీవల్లి.. మాటే మాణిక్యమాయేనే.. చూపే బంగారమయ్యేనే శ్రీవల్లి.. న‌వ్వే న‌వ‌ర‌త్న‌మాయెనే' అంటూ చంద్రబోస్ రాసిన లిరిక్స్ అల‌రిస్తున్నాయి.
 
ఈ సినిమా కోసం చంద్ర‌బోస్ రాసిన 'దాక్కో దాక్కో మేక' పాట‌కు కూడా మంచి స్పంద‌న వ‌చ్చిన విష‌యం తెలిసిందే. 'శ్రీ‌వ‌ల్లి' పాటని అక్టోబరు 13న ఉదయం 11.07కు విడుదల చేసింది. 
 
ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్, సునీల్, రావు రమేశ్, అజయ్ ఘోష్, అనసూయ తదితరులు కీలక పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమాలోని మొదటి భాగం డిసెంబర్‌ 17వ తేదీన విడుదల కానున్న‌ట్లు ఆ సినిమా యూనిట్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది.