Astrology Yearly Horoscope Details

Notifications

కర్కాటకం కర్కాటకం
ఆదాయం-2 వ్యయం-11 రాజపూజ్యం-4 అవమానం- 7 ఈ సంవత్సరం ఈ రాశివారికి పరీక్షా సమయం. ఓర్పుతో శ్రమిస్తే అనుకున్న కార్యం సిద్ధిస్తుంది. వ్యవహార, సంప్రదింపులతో సతమతమవుతారు. అగ్రిమెంట్ల విషయాలో జాగ్రత్తగా ఉండాలి. అనాలోచిత నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. ఆదాయం పెంచుకునే దిశగా యత్నాలు సాగిస్తారు. ఆప్తుల సాయంతో కొన్ని అవసరాలు నెరవేరుతాయి. పొదుపు పథకాలు కలిసిరావు. దంపతుల మధ్య తరచు కలహాలు, వెంటనే రాజీపడటం జరుగుతుంది. ఆత్మీయుల ప్రోత్సాహంతో వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆశించిన సంబంధం నిరుత్సాహపరుస్తుంది. ఇదీ ఒకందుకు మంచికేనని భావించండి. త్వరలో ఇంతకంటే మంచి సంబంధం కుదిరే అవకాశాలున్నాయి. అనుక్షణం సంతానం భవిష్యత్తు గురించి ఆలోస్తారు. పిల్లల విషయంలో ఆందోళన చెందవద్దు. వారికి మంచి ర్యాంకులు, విదేశీ విద్యావకాశాలు లభిస్తాయి. గృహనిర్మాణాలు పూర్తికావస్తాయి. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు ఆదాయం బాగుంటుంది. వ్యవసాయపరంగా మెట్టరైతులకు కష్టకాలం. అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతినే ఆస్కారం ఉంది. వారికి అందిన సాయం అసంతృప్తి కలిగిస్తుంది. మాగాణి రైతులకు బాగుంటుంది. అధిక దిగుబడి సాధించటంతో పాటు గిట్టుబాటు ధర లభిస్తుంది. ఉద్యోగస్తులకు స్థానచలనంతో కూడిన పదోన్నతి. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు అధికంగా ఉంటాయి. విద్యార్థులు సాధించే ఉత్తమ ఫలితాలపై వీరి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. విద్యార్థులకు ఏకాగ్రత, లక్ష్యం పట్ల నిరంతర కృషి ముఖ్యం. పట్టుదలతో శ్రమించి మంచి ర్యాంకులు సాధించగల్గుతారు. వీరికి విదేశీ విద్యావకాశం లభించే అవకాశం తక్కువే. సాఫ్ట్‌వేర్ రంగ విద్యార్థులకు ప్రోత్సాహకరమైన అవకాశాలు లభిస్తాయి. వ్యాపారపరంగా చూస్తే హోల్సేల్ వ్యాపారులకు, స్టాకిస్టులకు ఆదాయం బాగుంటుంది. ముఖ్యంగా వస్త్ర వ్యాపారాలు జోరుగా సాగుతాయి. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి సామాన్యంగా ఉంటుంది. న్యాయ, వైద్య, విద్య, సాంకేతిక రంగాల వారికి ఆశాజనకం. న్యాయవాదులు చేపట్టిన కేసుల్లో విజయం సాధిస్తారు. వైద్యరంగాల వారికి శస్త్ర చికిత్సల సమయంలో ఏకాగ్రత ముఖ్యం. ప్రభుత్వ లెక్చరర్లకు బదిలీతో కూడిన పదోన్నతి. ఈ రాశివారు ఆరోగ్యం పట్ల శ్రద్ధవహించాలి. ఔషధ సేవనం, ఆహార నియమాల్లో అలక్ష్యం తగదు. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. సోదరి సోదరుల మధ్య ఆస్తి వివాదాలు జటిలమవుతాయి. తరచుగా శుభకార్యాల్లో పాల్గొంటారు. ఇంటిని నిర్లక్ష్యంగా వదిలివెళ్లకండి. నగదు, వెండి, బంగారాలు అపహరణకు గురయ్యే ఆస్కారం ఉంది. బంధుమిత్రలతో సత్సంబంధాలు, ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. అయిన వారితో ఉల్లాసంగా కాలక్షేపం చేస్తారు. పూర్వ గురువులు, స్నేహితులను కలుసుకుంటారు. వాహనం అమర్చుకోవాలనే కోరిక అతికష్టంమ్మీద నెరవేరుతుంది. గృహంలో శుభకార్యాలు జరిగే అవకాశాలున్నాయి. మీ సిఫార్సుతో ఒకరికి ఉద్యోగవకాశం లభిస్తుంది. తరచుగా ప్రయాణాలు చేస్తుంటారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవదీక్షలు, ధార్మిక సంస్థల్లో సభ్యత్వాలు స్వీకరిస్తారు. మొత్తంమ్మీద ఈ రాశివారికి ఈ సంవత్సరం కొంతమేరకు శుభదాయకంగాను, సమస్యాత్మకంగాను ఫలితాలు ఉండగలవు.

విజయవాడలో దసరా నాటికి వందే భారత్ స్లీపర్ రైళ్లు

విజయవాడలో దసరా నాటికి వందే భారత్ స్లీపర్ రైళ్లుసుదూర ప్రయాణం చేసే ప్రయాణికులకు ప్రయోజనం చేకూర్చేలా, ప్రస్తుతం ఉన్న వందే భారత్ చైర్ కార్ సేవలను మెరుగుపరిచేందుకు భారతీయ రైల్వే వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. విజయవాడ డివిజన్‌లో దసరా నాటికి ఈ స్లీపర్ వెర్షన్ రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని రైల్వే అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ వందే భారత్ స్లీపర్ రైళ్లు ప్రపంచ స్థాయి సౌకర్యాలను కలిగి ఉండి, ప్రయాణికులకు విమాన ప్రయాణంతో సమానమైన అనుభూతిని అందిస్తాయి. ప్రస్తుతం, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు విజయవాడ మీదుగా సికింద్రాబాద్, చెన్నై, విశాఖపట్నం నగరాలను అనుసంధానిస్తున్నాయి.

ఇరాన్ ట్రైలర్ మాత్రమే చూసింది.. ముందుంది అసలు సినిమా : డోనాల్డ్ ట్రంప్

ఇరాన్ ట్రైలర్ మాత్రమే చూసింది.. ముందుంది అసలు సినిమా : డోనాల్డ్ ట్రంప్ఇరాన్‌ సాగుతున్న యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఘాటుగా స్పందించారు. ఇరాన్‌పై ఇప్పటివరకు జరిగిన దాడులను కేవలం ట్రైలర్‌ మాత్రమేనని, మున్ముందు సినిమా చూపిస్తామని ఆయన హెచ్చరించారు. పైగా, ఇప్పట్లో ఆ దేశాన్ని వదిలే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా నతాంజ్ అణు కేంద్రానికి సమీపంలో ఉన్న పికాక్స్ పర్వతంపై భీకర దాడులు చేస్తామని హెచ్చరించారు. వాటి కింద ఉన్న రహస్య భూగర్భంలో ఆ దేశం అణు కార్యక్రమాలు తిరిగి ప్రారంభిస్తోందని పేర్కొన్నారు. మళ్లీ అణ్వాయుధాలను తయారు చేయకుండా ఆపడానికి దానిని పూర్తిగా నాశనం చేస్తామన్నారు. ఇప్పటివరకు ఇరాన్‌పై జరిగిన దాడులు కేవలం ట్రైలర్‌ మాత్రమే అని.. త్వరలో సినిమా చూపిస్తామంటూ వ్యాఖ్యానించారు.

భక్తుల రద్దీ: గురువారం నాటి SSD టోకెన్లను రద్దు చేసిన టీటీడీ

32 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ - సింహాచలంలో భారీ ఏర్పాట్లు

32 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ - సింహాచలంలో భారీ ఏర్పాట్లుజూలై 28న జరగనున్న వార్షిక సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి గిరి ప్రదక్షిణ కోసం చేసిన ఏర్పాట్లను జిల్లా అధికారులు మంగళవారం సమీక్షించారు. లుంబినీ పార్క్ నుండి సీతమ్మధార, మాధవధార, ఎన్‌ఎస్‌టీఎల్, గోశాల, తొలి పవంచ్ మీదుగా వెళ్లే 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ మార్గాన్ని తనిఖీ చేశారు. లక్షలాది మంది భక్తులు పాల్గొంటారని అంచనా వేస్తున్న నేపథ్యంలో.. ఈ మార్గం పొడవునా తాగునీరు, మరుగుదొడ్లు, వైద్య సేవలు, వీధి దీపాలు, పార్కింగ్, కంట్రోల్ రూములు, సీసీటీవీ నిఘా, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్‌లు, సైన్‌బోర్డులు, చెత్త సేకరణ వాహనాలు, అంబులెన్సులు, పారిశుధ్యం కోసం తగిన ఏర్పాట్లు ఉండేలా చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

22-07-2026 బుధవారం ఫలితాలు - మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది

విద్యా ప్రతిభకు, జ్ఞాపక శక్తికి హయగ్రీవుని మంత్రం

విద్యా ప్రతిభకు, జ్ఞాపక శక్తికి హయగ్రీవుని మంత్రంచదువుల్లో రాణించాలన్నా, జ్ఞానాన్ని సముపార్జించాలన్నా దానికి హయగ్రీవుని ప్రార్థించాలి. భక్తితో ఆయనను ఈ క్రింది శ్లోకాన్ని పఠిస్తే విద్యలో ఉన్నత స్థానానికి చేరుకోవచ్చు. ఆ శ్లోకాన్ని పఠిద్దాం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే ఈ శ్లోకాన్ని జపిస్తే జ్ఞానాన్ని పొందుగలుగుతారు. చదువులో ఏకాగ్రతను సాధిస్తారు. నిత్యం హయగ్రీవుని కొలిచేవారు మంచి జ్ఞాపకశక్తిని కలిగి ఉంటారు. శ్రీ మహావిష్ణు అవతారమైన హయగ్రీవుడు జ్ఞాన సముద్రం. ఆయన వేదం యొక్క నాలుగు రూపాలైన ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదాలు. హయగ్రీవుడు సరస్వతి దేవికి జ్ఞానాన్ని బోధించాడని పురాణాల్లో చెప్పబడింది.

21-07-2026 మంగళవారం ఫలితాలు- తప్పుచేశామన్న భావం రానీయకండి