గురువారం, 26 జూన్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By jsk
Last Modified: బుధవారం, 17 ఆగస్టు 2016 (21:26 IST)

అమ‌రేశ్వ‌రాల‌యం సంద‌ర్శిస్తే... ప‌ద‌వీగండం! మ‌రి చంద్ర‌బాబు ప‌రిస్థితి ఏమిటో?

విజ‌య‌వాడ‌: అమరావతిలోని అమరేశ్వరాలయాన్ని ఎప్పుడు ఏ ప్ర‌ముఖులు సంద‌ర్శించినా వారికి గడ్డు కాలం ఏర్ప‌డుతుంద‌ట‌. త‌ర‌త‌రాలుగా ఇదే జ‌రుగుతూ వ‌స్తోంద‌ని సెంటిమెంట్. అయ్యవారిని దర్శించుకున్న పదవిలో ఉన్న నాయకులూ, అధికారులు... తమ అధికారాన్ని పదవులను కోల్పోవడ

విజ‌య‌వాడ‌: అమరావతిలోని అమరేశ్వరాలయాన్ని ఎప్పుడు ఏ ప్ర‌ముఖులు సంద‌ర్శించినా వారికి గడ్డు కాలం ఏర్ప‌డుతుంద‌ట‌. త‌ర‌త‌రాలుగా ఇదే జ‌రుగుతూ వ‌స్తోంద‌ని సెంటిమెంట్. అయ్యవారిని దర్శించుకున్న పదవిలో ఉన్న నాయకులూ, అధికారులు... తమ అధికారాన్ని పదవులను కోల్పోవడం అనాది కాలంగా జ‌రుగుతూ వ‌స్తోంది.
 
ఇది ఓ సెంటిమెంట్‌గా కొనసాగుతోంది. ఇది తెలిసిన వారెవరు అమరావతి వెళ్లినా... కృష్ణా నదిలో స్నానం ఆచరించినా, అమరేశ్వర ఆలయ సందర్శన చేసే దుస్సాహసం చేయరు. కానీ, ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఈ దుస్సంప్ర‌దాయానికి గండికొట్టారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిని, అమరేశ్వర ఆలయాన్ని సందర్శించారు. మ‌రి ఏమి జ‌రుగుతుందో అని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఫలితం దైవేచ్ఛ అంటున్నారు.